Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
రానా మరో సెన్సేషనల్ ప్రాజెక్టు.. ఎవరూ గుర్తుపట్టని విధంగా భళ్లాలదేవ ఫొటో వైరల్!
బాహుబలి ఘన విజయం తర్వాత రానా దగ్గుబాటి క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్లో హాథీ మేరే సాథీ, హౌస్ఫుల్ 4 చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా, పరిణితి చోప్రా, అమ్మీ విర్క్, సంజయ్ దత్ లాంటి వారితో కలిసి ఈ ప్రాజెక్ట్లో నటిస్తున్నాడు.
ఇలా క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న రానా దగ్గుబాటి ప్రస్తుతం మరో సంచలన ప్రాజెక్టులో నటించడానికి రంగం సిద్ధమవుతున్నది. రానాతో బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ను తెరకెక్కించే ఏర్పాట్లు చేస్తున్నాడట. ఇందుకోసం రానా, కరణ్ జోహర్ ఇద్దరు ఇటీవల సమావేశమై చర్చించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ను త్వరలోనే పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా, తెలుగులో వేణు ఊడుగుల తెరకెక్కించే విరాటపర్వం 1992 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్. నక్సలైట్ ఉద్యమం, తెలంగాణ బ్యాక్ డ్రాప్తో జరిగే ఈ కథలో రానా ఓ ప్రభావవంతమైన పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తున్నది.
అంతేకాకుండా రానా దగ్గుబాటి 1945 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తున్నది. తాజాగా గుర్తుపట్టనంత వీలుగా రానా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ముతక డ్రస్సులో, గెడ్డంలో రానా లుక్ వైరల్గా మారింది.