Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
‘విరాట పర్వం’ వచ్చేది అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన యూనిట్
సినిమా విడుదల కంటే ముందే.. నటీనటుల ఎంపికతోనే అందరినీ ఆశ్చర్యపరిచింది విరాటపర్వం యూనిట్. నీదీ నాదీ ఒకే కథ వంటి సహజ చిత్రాన్ని తీసిన దర్శకుడు వేణు ఊడుగుల.. విరాట పర్వం చిత్రాన్ని ప్రకటించడంతోనే అంచనాలు పెరిగాయి. ఇక అందులో ఒక్కొక్క పాత్రను పరిచయం చేస్తూ వదిలిన పోస్టర్లతో అంచనాలు ఆకాశన్నంటాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ వచ్చింది.
మామూలుగా నేడు టాలీవుడ్లో అప్డేట్ల పండుగ నడుస్తోంది. దాదాపు సెట్స్ మీదున్న సినిమాలన్నీ కూడా రిలీజ్ డేట్లను ప్రకటిస్తూ ఆ తేదీలను బ్లాక్ చేసేసుకుంటున్నాయి. ఈక్రమంలో తాజాగా విరాట పర్వం కూడా ముందుకు కదిలింది. కామ్రేడ్ రవన్న విశ్వరూపం, తిరుగుబాటును చూపించే తేదీని తాజాగా ప్రకటించేసింది విరాట పర్వం యూనిట్. ఏప్రిల్ 30న థియేటర్లలో విరాట పర్వం సందడి చేయబోతోన్నట్టు ప్రకటించేశారు.
ఇక విరాట పర్వం సినిమాతో డైరెక్టర్ వేణు మరో హిట్ కొట్టేలా ఉన్నాడు. ఈ మూవీలో సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, ఈశ్వరీ రావ్ వంటి అద్భుతమైన నటీమణులెందరో ఉన్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్స్, మోషన్ పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. రానా ఇప్పటికే తన డబ్బింగ్ను కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విరాటపర్వం సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.