Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రానా, మిహికల మ్యారేజ్ ప్లాన్స్లో భారీ మార్పులు.. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి!
కరోనా వైరస్ కారణంగా ఈ సారి పెళ్లి వేడుకలు చాలా సింపుల్ గానే జరుగుతున్నాయి. ఇక సెలబ్రెటీస్ కూడా చాలా వరకు రిస్క్ చేయకుండా పెళ్లి పనులను ముగించేస్తున్నారు. నిజాంగా ఈ గోల లేకుంటే ఈపాటికి దగ్గుబాటి పెళ్లి సంబరాలు ఒక రేంజ్ లో ఉండేవి. వారి కుటుంబంలో చాలా రోజుల తరువాత జరుగుతున్న శుభకార్యం కావడంతో రానా పెళ్లిని ఒక రేంజ్ లో చేయాలని నిర్మాత సురేష్ బాబు ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు. కానీ కరోనా వల్ల ప్లాన్స్ లో మార్పులు చేయక తప్పలేదు.
ముహూర్తంలో ఎలాంటి మార్పు లేదు
రానా దగ్గుబాటి - మిహికా బజాజ్ పెళ్లి ఎలా చేస్తారు అని గత కొంత కాలంగా అనేక రూమర్స్ వస్తున్నాయి. ఆగస్ట్ లోనే వీరి డేట్ ఫిక్స్ అయ్యింది. కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతుండడం వలన పెళ్లి కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కూడా కథనాలు వచ్చాయి. కానీ మిహికా గత నెలలోనే ఒక స్పెషల్ ఫొటోలతో పనులు యదవిధిగా కొనసాగుతున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది.
అతిధుల్లో భారీ మార్పులు
దగ్గుబాటి వారి పెళ్లికి రాబోయే అతిధులు ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక వేడుకకు 30మంది మాత్రమే రాబోతున్నారట. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొంతమంది వివిఐపి గెస్టులు పెళ్లికి రానున్నట్లు తెలుస్తోంది. అయితే సురేష్ బాబు పరిచయాలు బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఉన్నాయి. ఆ 30 మందిలో ఎవరెవరు ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది.
ఎవరెవరు వస్తారో..
సురేష్ బాబుకు పొలిటీషియన్స్ నుంచి స్టార్ సెలబ్రెటీస్ వరకు క్లోజ్ గా ఉండే వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఇక ఇలాంటి సమయంలో పెళ్లికి ఎవరెవరిని పిలుస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏ మాత్రం రిస్క్ చేయకుండా కేవలం అతి తక్కువ మంది వేడుకకు రాబోతున్నట్లు.
వారికి కరోనా పరీక్షలు..
ఇక పెళ్లి వేడుకలో హాజరయ్యే ప్రతి ఒక్కరికి ముందే కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు టాక్ వస్తోంది. ఇప్పటికే వారి కుటుంబ సబ్యులకు అందరికి కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించి ఎవరిని బయటకు వెళ్లనివ్వకుండా క్వారంటైన్ లోనే ఉంచారని సమాచారం. పెళ్లి మొత్తం పూర్తయ్యే వరకు ఏ ఒక్కరు బయటకు వెళ్లవద్దని సురేష్ బాబు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
పెళ్లి వేదిక చేంజ్..
ముందుగా ఎంగేజ్మెంట్ సింపుల్ గా ఫినిష్ చెసుకోవచ్చు కానీ పెళ్లిని మాత్రం వీలైనంత వరకు కాస్త గ్రాండ్ గా నిర్వహించాలని సురేష్ బాబు ప్లాన్ చేసుకున్నారు. అందుకోసం ఫలక్ నుమా ప్యాలెస్ ని కూడా బుక్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అతికొద్ది మంది సభ్యులే రాబోతున్నారు కాబట్టి రామానాయుడు స్టూడియోకి షిఫ్ట్ అయినట్లు సమాచారం. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం తగిన జాగ్రత్తలను అనుసరించి పెళ్లిని హ్యాపీగా నిర్వహించాలని దగ్గుబాటి వారు ఆలోచిస్తున్నారు.