Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రానా రాగానే... సాయి పల్లవి వెళ్లిపోయింది.. హాలీవుడ్ అడ్వెంచర్ మూవీలా విరాటపర్వం
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి - సాయి పల్లవి కలిసి చేయబోతున్న చిత్రం 'విరాట పర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రానా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని, అలాగే సాయి పల్లవి మావోయిస్టుగా కనిపించబోతుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్గా సాగనుందని తెలుస్తోంది. అయితే, ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. దీనికి కారణం తరచూ ఏదో ఒక ఆటంకం రావడమే. తాజాగా ఈ సినిమాకు మరో అడ్డంకి వచ్చింది. ఇంతకీ ఏంటా అడ్డంకి..?
ఒకటి కాదు.. ఎన్నో సార్లు ఆగింది
వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఇది ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే, కొద్దిరోజుల క్రితం చిత్ర యూనిట్ ఈ సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుందని వెల్లడించింది. కానీ, సరైన తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే, ఇటీవల ఈ సినిమా తాలూకు పోస్టర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
రానాకు సర్జరీ.. ఆమెతో చేయించారు
చాలా రోజుల పాటు దగ్గుబాటి రానా విదేశాల్లో ఉన్నాడు. ఆయనకు కిడ్నీకి సంబంధించిన చికిత్స జరిగిందని వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ఈ విషయంపై అటు రానా గానీ, ఇటు కుటుంబ సభ్యులు కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో అతడు చేయాల్సిన సినిమాలన్నీ ఆగిపోయాయి. అందులో ‘విరాట పర్వం' కూడా ఉంది. అయితే, అప్పుడు హీరోయిన్ పార్ట్ను షూట్ చేసేశారు.
రానా వచ్చాడు.. ఆమె వెళ్లింది
ఇక, తాజాగా రానా విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. దీంతో ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పున: ప్రారంభం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి.. నాగ చైతన్య - శేఖర్ కమ్ముల సినిమా కోసం వెళ్లిపోయింది. దీంతో కొద్ది రోజుల పాటు రానా చేయాల్సిన పార్ట్ను షూట్ చేస్తారట చిత్ర యూనిట్. ఆ తర్వాత సాయి పల్లవి డేట్స్ తీసుకుని ఇద్దరి మధ్య సీన్లు చిత్రీకరిస్తారని తాజాగా వార్త బయటకు వచ్చింది.
హాలీవుడ్ అడ్వెంచర్ ఫిల్మ్
విరాట పర్వం సినిమా మొత్తం అడవిలోనే ఉంటుందట. అంతేకాదు, అడవిలో జరిగే పోరాటాలతో ఈ సినిమాను హాలీవుడ్ అడ్వెంచర్ మూవీలా తెరకెక్కించబోతున్నారట. అందుకే ఈ సినిమాను ఎంతో క్వాలిటీతో రూపొందించాలని చిత్ర యూనిట్ భావిస్తుందని సమాచారం. నటీనటుల ఎంపిక కూడా దీని ఆధారంగానే ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే జర్మనీకి చెందిన స్టేఫాన్ రిచర్ అనే స్టంట్ కొరియోగ్రాఫర్ను తీసుకు వస్తున్నారట.