Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
టాలీవుడ్లో మరో సినిమా విడుదల వాయిదా: అధికారికంగా ప్రకటించిన రానా
తెలుగు సినీ ఇండస్ట్రీలో లాక్డౌన్ తర్వాత చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ తర్వాత కూడా చాలా సినిమాల విడుదల తేదీలు ఒక్కొక్కటిగా వెలువడ్డాయి. దీంతో మూవీ ఫెస్టివల్ ప్రారంభం అయిపోయిందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్లో కొన్ని మూవీల రిలీజ్ డేట్లను వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇప్పుడిదే జాబితాలోకి మరో సినిమా కూడా వచ్చి చేరింది. అదే.. దగ్గుబాటి రానా నటిస్తోన్న 'విరాట పర్వం'. తాజాగా ఈ మూవీ యూనిట్ నుంచి షాకింగ్ అప్డేట్ వచ్చింది.
టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా - టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'విరాట పర్వం'. రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమాను వేణు ఉడుగుల రూపొందిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇలాంటి సమయంలో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. 'కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో 'విరాట పర్వం'ను వాయిదా వేయాలని నిర్ణయించాం. కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటిస్తాం' అని అందులో పేర్కొంది.
'విరాట పర్వం'ను ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగుల మేలవింపుతో రూపొందుతోన్న ఈ సినిమాలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్, నవీన్చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇక, ఇందులో రానా కామ్రేడ్ రవన్న గెటప్లో ఉండగా.. సాయి పల్లవి మాత్రం పల్లెటూరి అమ్మాయిలా నటిస్తోంది.