Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ను ఢీ కొట్టేందుకు రెడీ.. సెట్లో అడుగుపెట్టిన రానా
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్లు వెంట వెంటనే వచ్చేస్తున్నాయి. ఈ రీమేక్కు సంబంధించి తెలుగు వర్షెన్ త్రివిక్రమ్ రాస్తున్నాడంటూ ఇచ్చిన అప్డేట్ ఓ రేంజ్లో వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ సినిమా సెట్లో అడుగుపెట్టాడంటూ విడుదల చేసిన టీజర్ ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది.
ఆ విషయం ఇంకా మరిచిపోక ముందే మరో అప్డేట్ ఇచ్చారు. ఇందులో రానాకు సంబంధించిన విషయాన్ని చెప్పారు. నేడు రానా ఈ మూవీ సెట్లొ అడుగుపెట్టాడని చెబుతూఅదిరిపోయే స్టిల్ను షేర్ చేశారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందన్న సంగతి తెలిసిందే. యాక్షన్ సీక్వెన్స్తో సినిమా షూటింగ్ను ప్రారంభించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి లు పాల్గొనగా పదిరోజులపాటు హైదరాబాద్ లో చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలిపారు నిర్మాత.
ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ప్రముఖ నటులుసముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను వంటి వారంతా ఈ రీమేక్లో నటిస్తున్నారు. ఇక తమన్ సైతం మ్యూజిక్ సిట్టింగ్స్ను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.