Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పవన్ కళ్యాణ్ను ఢీ కొట్టేందుకు రెడీ.. సెట్లో అడుగుపెట్టిన రానా
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్లు వెంట వెంటనే వచ్చేస్తున్నాయి. ఈ రీమేక్కు సంబంధించి తెలుగు వర్షెన్ త్రివిక్రమ్ రాస్తున్నాడంటూ ఇచ్చిన అప్డేట్ ఓ రేంజ్లో వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ సినిమా సెట్లో అడుగుపెట్టాడంటూ విడుదల చేసిన టీజర్ ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది.
ఆ విషయం ఇంకా మరిచిపోక ముందే మరో అప్డేట్ ఇచ్చారు. ఇందులో రానాకు సంబంధించిన విషయాన్ని చెప్పారు. నేడు రానా ఈ మూవీ సెట్లొ అడుగుపెట్టాడని చెబుతూఅదిరిపోయే స్టిల్ను షేర్ చేశారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందన్న సంగతి తెలిసిందే. యాక్షన్ సీక్వెన్స్తో సినిమా షూటింగ్ను ప్రారంభించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి లు పాల్గొనగా పదిరోజులపాటు హైదరాబాద్ లో చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలిపారు నిర్మాత.
ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ప్రముఖ నటులుసముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను వంటి వారంతా ఈ రీమేక్లో నటిస్తున్నారు. ఇక తమన్ సైతం మ్యూజిక్ సిట్టింగ్స్ను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.