Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సస్పెన్స్ థ్రిల్లర్ కథలో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్..
స్టార్స్ ఎంత మంది ఉన్నా కూడా కథలోని పాయింట్ జనాలకు ఎక్కకపోతే కష్టమంతా వృధా అవుతుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కాన్సెప్ట్ ఎంత కొత్తగా ఉంటే అంత బాగా లైక్ చేస్తున్నారు నేటితరం ఆడియెన్స్. నిజానికి అలాంటి సినిమాలకు ప్రమోషన్స్ కూడా అవసరం లేదు. ఇక త్వరలోనే 'నాటకం' ఫేమ్ ఆశిష్ గాంధీ కూడా అలాంటి సినిమాతోనే ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 'రంగులరాట్నం' ఫేమ్ చిత్ర శుక్ల హీరోయిన్ గా నటిస్తున్న ఆ సస్పెన్స్ థ్రిల్లర్ రాజ్కుమార్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది
ఇక బాబీ ఏడిద క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఎవర్గ్రీన్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సినిమా ప్రారంభ సన్నివేశం నుంచి ఆఖరి సన్నివేశం వరకూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని నిర్మాత వివరణ ఇచ్చారు. ఇక ఈ కథలోని మలుపులు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయని నాటకం తదితర చిత్రాల్లో నటించిన ఆశిష్ గాంధీ ఈ చిత్రంలో అలా డిఫరెంట్ పాత్రలో నటించనున్నారని తెలిపారు.
రంగుల రాట్నం, సిల్లీ ఫెలోస్, మా అబ్బాయి వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న చిత్ర శుక్ల ఇందులో కథానాయికగా కనిపించనుంది. ఇక త్వరలోనే సినిమా తారాగణం యొక్క పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. షూటింగ్ విషయానికి వస్తే డిసెంబర్ మొదటి వారం నుంచి రాజమండ్రి, కాకినాడ, నిడదవోలు, రంపచోడవరం, గుడిసె, రాజానగరం తదితర ప్రాంతాల్లో ఒక కీలకమైన షెడ్యూల్ కొనసాగనున్నట్లు నిర్మాత తెలిపారు.