Don't Miss!
- News రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్, క్లాస్ మేట్ కోసం ఏం చేశాడంటే?, బాంబర్ తో అన్ని నెలలు!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
లైవ్లో కన్నీరుమున్నీరైన రష్మీ.. వాటిపై దయచూపండని వేడుకున్న యాంకర్
బుల్లితెరపై యాంకరింగ్కు కొత్త గ్లామర్ అద్దిన భామ రష్మీ గౌతమ్. అప్పటి వరకు అనసూయ తన అందాలతో నడిపించుకుంటూ వచ్చిన జబర్దస్త్ను రష్మీ పరుగులు పెట్టింది. బుల్లితెరపై గ్లామర్ను ఒలకబోస్తూ.. వెండితెరపైనా అవకాశాలను అందిపుచ్చుకుంది. అయితే అక్కడ అనుకున్నంత గుర్తింపు రాలేదు. అయినా సరే బుల్లితెరపై రష్మీ అంటే ఓ సెక్షన్ ఆడియన్స్కు ఎప్పుడూ క్రేజే.
తెరపై రష్మీ, నిజ జీవితంలో రష్మీ వేరు..
తెరపై కనిపించే రష్మీకి, నిజ జీవితంలో కనిపించే రష్మీకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. తెరపై ఎంతో చలాకీగా ఉండే రష్మీ.. రియల్ లైఫ్లో ఎంతో సెన్సిటివ్గా ఉంటుంది. మూగజీవాల పట్ల అమితమైన ప్రేమను ప్రదర్శిస్తూ.. వాటి గురించి పరితపిస్తూ ఉంటుంది.
రంగులు చల్లకండి..
రష్మీకి మూగ జీవాలపై ప్రేమ ఎక్కువ. అందుకే రష్మీ వాటికి సంబంధించిన విషయాలపై ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. ఎక్కడైనా కుక్క పిల్లలకు హాని జరుగుతూ ఉంటే ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆ మధ్యహోలీ సమయంలోనూ స్పందిస్తూ.. కుక్కలపై రంగులు చల్లకండని సూచించింది.
కరోనా కష్టకాలంలో మూగజీవాలను..
కరోనా కష్టకాలంలో మూగజీవాల ఇబ్బందులను గ్రహించిన రష్మీ.. వాటికోసం ఆహారాన్ని పంపిణీ చేసింది. ఈ మేరకు రాబిన్ హుడ్ఆర్మీ సాయాన్ని తీసుకుంది. ఈ సందర్భంగా పోస్ట్ చేస్తూ.. నేను కనిపించే విధానాన్ని పట్టించుకోకండి.. ఎందుకంటే ఫ్యాన్స్ మధ్యలో తిరుగుతూ ఇదంతా నేను చేయలేను.. ఈ సందర్భంగా రాబిన్ హుడ్ ఆర్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.. వారు లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు.. అంటూ పోస్ట్ చేసింది.
Recommended Video
లైవ్లో కన్నీరుమున్నీరు
తాజాగా లైవ్లోకి వచ్చిన రష్మి..లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న మూగజీవాల పరిస్థితిని తలచుకొని కన్నీరుమున్నీరైంది. లాక్డౌన్ వల్ల ప్రజలందరు ఇళ్ళకే పరిమితమయ్యారని. పేద కార్మికులు, కూలీలు సమయానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చింది. అలానే మూగ జీవాలు ఆవులు, కుక్కలు, పిల్లుల లాంటివి కూడా ఆహారం లేకుండా అలమటిస్తున్నాయని మానవతా దృక్పథంతో మూగజీవాల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తూ కన్నీరు పెట్టుకుంది.