Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రవిబాబు 'క్రష్' వచ్చేస్తోంది.. మూడు జంటలూ నగ్నంగా ఆసక్తికర అనౌన్స్మెంట్!
సీనియర్ నటుడు చలపతిరావు వారసుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన రవిబాబు మొదట నటుడుగా రాణించాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి సక్సెస్ ఫుల్ నిర్మాతగా మారారు ఆయన. అల్లరి సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన తొలి సినిమాతో మంచి మార్కులు సంపాదించారు. ఇక ఒకే జోనర్లో సినిమాలు చేయకుండా ఆయన రకరకాల సినిమాలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న క్రష్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే
ఆ సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో
అల్లరి, నచ్చావులే లాంటి సినిమాలతో కామెడీ పండించిన రవిబాబు.. అనసూయ, అమరావతి, అవును, అవును 2 వంటి హారర్ సినిమాలతో అంతే భయపెట్టాడు. ఇక ఆఖరికి పందిని హీరోగా పెట్టి 'అదుగో' అనే సినిమా చేయగా ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత దిల్ రాజుతో కలిసి 'ఆవిరి' సినిమా రిలీజ్ చేశాడు, కానీ ఆ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.
ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా
ఇక ఆయన చేసిన మరో సినిమా 'క్రష్', రిలీజ్ కి సిద్దం అవుతోంది. తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్పై తన దర్శకత్వంలో రవిబాబు ఈ సినిమాను నిర్మించారు. నిజానికి ఈ సినిమా గత ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది. గత ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా టైటిల్ లుక్ను విడుదల చేసి సెప్టెంబర్ లో టీజర్ రిలీజ్ చేశారు.
టిఫిన్ కానిచ్చాను, పైపైనే
ఈ టీజర్ వచ్చినప్పుడే రచ్చ రేపింది. 'టిఫిన్ కానిచ్చాను, పైపైనే, టంగ్ మని లేచింది.. అంటూ రకరకాల డబుల్ మీనింగ్ డైలాగ్లతో టీజర్ నిండి పోయింది. ఇక డైలాగులు పక్కన పెడితే రొమాంటిక్ సీన్లలో కూడా నటించిన అందరూ రెచ్చిపోయి మరీ నటించారు. దీంతో టీజర్ మాత్రం ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. గత సినిమాలతో సంబంధం లేకుండా మరో కొత్త జోనర్ సినిమాలా అనిపిస్తోంది.
జీ5 ఓటీటీలో
ఈ సినిమా థియేటర్ రిలీజ్ అవుతుందని అందరూ భావిస్తూ ఉండగా ఈ సినిమా జీ5 ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. ఈ క్రష్ తో ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉండండి, 9th జూలై నుండి మీ ముందుకు వచ్చేస్తుంది, ఎక్స్ క్లూజివ్ గా #ZEE5 లో మాత్రమే అంటూ ప్రకటన చేశారు. కృష్ణ బూరుగుల, అభయ్, సింహా రెడ్డి, పరీ పాండే, శ్రీ సుధా రెడ్డి నటించిన ఈ సినిమా నుంచి ఆసక్తికర ప్రకటన వచ్చింది.
Recommended Video
నగ్నంగా ఉన్న మూడు జంటలు
ఆసక్తికరంగా నగ్నంగా ఉన్న మూడు జంటలు దుప్పటి అడ్డం పెట్టి ఈ ప్రకటన చేశారు. ఈ సినిమా టీజర్ తో పాటు, ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ చూస్తే మాత్రం సినిమా రచ్చ రేపే విధంగా ఉంటుందని అర్ధం అవుతోంది. ఇక మీరు కూడా చూసేయండి మరి.