Don't Miss!
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- News ఓటు వెయ్యకపోయినా పర్వాలేదు, నా అంత్యక్రియలకు రండి, ప్రధాని అభ్యర్థి, మోదీని టార్గెట్ చేసి !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఒకే పోస్టర్తో అంచనాలు పెంచేసిన రవితేజ: కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న ఆయన.. చాలా కాలంగా విజయాన్ని అందుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ప్రారంభంలో 'క్రాక్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు కెరీర్లోనే భారీ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే 'ఖిలాడీ' అనే సినిమాను మొదలెట్టేశాడు. ఇది పట్టాలపై ఉండగానే ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించేశాడీ సీనియర్ హీరో.
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ.. శరత్ మందవ అనే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ నేడు అధికారికంగా ప్రారంభం అయింది. దీనికి సంబంధించిన ప్రకటనను సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన చిత్ర యూనిట్.. ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఇందులో రవితేజ కుర్చిలో కూర్చుని ఉండగా.. అతడికి ఎదురుగా మెజిస్టేట్ అనే బోర్డు కనిపిస్తోంది. అలాగే, ఓ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన లెటర్ కూడా దర్శనమిస్తోంది. దీనికితోడు అతడు ఓ డెన్లో కూర్చుని ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో సినిమాపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న 'ఖిలాడీ' షూటింగ్ ఫారెన్ షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది. అక్కడ కరోనా నిబంధనల కారణంగా దీన్ని పూర్తి చేయడానికి సమయం పడుతోంది. అందుకే ఆ చిత్రాన్ని అలా ఉంచేసి.. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేశాడు. దీన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.