Don't Miss!
- News స్కాట్లాండ్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మాస్ డైరెక్టర్తో రవితేజ సినిమా: ‘ఖిలాడీ’ పూర్తయిన వెంటనే ఇదే చేస్తాడట
అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'రాజా ది గ్రేట్' మూవీ తర్వాత చాలా కాలం పాటు వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇలాంటి పరిస్థితుల్లో గోపీచంద్ మలినేని రూపొందించిన 'క్రాక్' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అదే సమయంలో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయం తర్వాత సీనియర్ హీరో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. మాస్ మహారాజా రవితేజ.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ పవర్ఫుల్ మూవీని చేయబోతున్నాడట. ఇటీవలే వీళ్లిద్దరి మధ్య కథా పరమైన చర్చలు జరిగాయని తెలిసింది. ఫస్ట్ సిట్టింగ్లోనే ప్రాజెక్టు ఓకే అయినట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. నందమూరి బాలకృష్ణతో బోయపాటి చేస్తున్న 'అఖండ' పూర్తయిన వెంటనే ఇది పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. రవితేజ కూడా అప్పటి కల్లా 'ఖిలాడీ' సినిమాను పూర్తి చేస్తాడని అంటున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో 'భద్ర' అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే.
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'ఖిలాడీ' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో అతడు డుయల్ రోల్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రాబోతున్న ఈ మూవీ టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక, ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు. దీనితో పాటు మరో సినిమానూ రవితేజ ప్రకటించాడు.