‘నువ్వు ఎవడైతే నాకేంటిరా’.. అదిరిపోయిన ‘క్రాక్’ టీజర్
మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్గా గోపిచంద్ మలినేనికి మంచి పేరుంది. రవితేజకు డాన్ శీను, బలుపు వంటి కమర్షియల్ హిట్ చిత్రాలను అందించిన ఈ దర్శకుడు మరోసారి ఓ సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. క్రాక్ అంటూ ఆడియన్స్కు పిచ్చెక్కిచ్చేందుకు వచ్చేస్తున్నాడు. ఇప్పటికే పోస్టర్లతో అంచనాలు పెంచేసిన క్రాక్ యూనిట్.. తాజాగా టీజర్ను రిలీజ్ చేసింది.
క్రాక్ మూవీలో రవితేజ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒంగోలులో జరిగే క్రైమ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోన్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని, శ్రుతీ హాసన్ వంటి వారు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోన్నట్లు తెలుస్తోంది. ఒరేయ్ అప్పిగా సుబ్బిగా.. నువ్వు ఎవడైతే నాకేంటి రా.. అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

అయితే క్రాక్ టీమ్ ముందుగా ప్రకటించిన సమయానికి కంటే కాస్త ఆలస్యంగా టీజర్ను విడుదల చేసింది. దాదాపు అరగంట ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అయితే తీరా టీజర్ను చూశాక.. ఇలాంటి టీజర్ గురించి అరగంట ఆగినా తప్పులేదని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











