Don't Miss!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాయలసీమ లవ్స్టోరి ఇంత నాటుగానా? మితిమీరిన అడల్ట్ కంటెంట్తో..
టాలీవుడ్లో నేటివిటీ చిత్రాల జోరు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నది. అడల్ట్ కంటెంట్కు భావోద్వేగాలను జోడించి రూపొందించిన అర్జున్ రెడ్డి, RX 100 సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేయడమే కాకుండా ప్రేక్షకులు, సినీ విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఆ తర్వాత అదే ఫార్మూలతో వచ్చిన చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అదే క్రమంలో రాయలసీమ నేటివిటితో ఓ చిత్రం తాజాగా మీడియాలో సందడి చేస్తున్నది. ఆ సినిమా ఏంటంటే..
అడల్ట్ కంటెంట్తో
అడల్ట్ కంటెంట్తో సక్సెస్ను పక్కన పెడితే ప్రేక్షకులను ఆకర్షించేద్దామనే ప్రయత్నంతో చేసిన సినిమా రాయలసీమ లవ్స్టోరి. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో నాటు, ఘాటు ఎక్కువగానే కనిపిస్తున్నది. అంతే కాకుండా ఇటీవల విడుదల చేసిన రాయలసీమ లవ్స్టోరి టీజర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిచాయి.
తొలి చిత్ర దర్శకుడిగా
A1 ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ద్వారా రామ్ రణధీర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా - నాగరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకట్, హృశాలి గోసవి హీరో,హీరోయిన్లుగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రంలో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన పావని మరో హీరోయిన్గా నటిస్తోంది.
అంచనాలు పెంచుతూ 20న రిలీజ్
అంచనాలు పెంచుకొంటున్న రాయలసీమ లవ్స్టోరీ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్నది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20న రిలీజ్ చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది . కాగా ఈ నెల 27 న రిలీజైన ట్రైలర్ డిజిటల్ మీడియాలో మంచి ఆదరణ పొందుతుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. కథలో భావోద్వేగం, యూత్ ఫుల్ అంశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయని అన్నారు.
నటీనటులు వీరే
నాగినీడు , 30 ఇయర్స్ పృథ్వీ , జీవా , నల్ల వేణు , తాగుబోతు రమేష్ , అదుర్స్ రఘు , గెటప్ శ్రీను , కొమరం , జబర్దస్త్ రాజమౌళి , మిర్చి మాధవి , సన్నీ , భద్రం , ప్రసన్న కుమార్ , మధుమని తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు సేవలందించారు.