దాదాపు ఇంట్లోనే కూర్చుంటున్నాను.. రేణూ దేశాయ్ కామెంట్స్ వైరల్
ప్రస్తుతం దేశంలో కరోనా ఎంతగా విజృంభిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెకండ్ వేవ్ మొదలైన నుంచి రోజుకూ వేలల్లో లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లు లాక్డౌన్ను విధించాయి. ఇంకొన్ని రాష్ట్రాలు కఠిన తర నిబంధనలను అమలుపరుస్తున్నాయి. మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం తప్పని సరి చేస్తున్నాయి. అయినా కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కరోనా తాండవం చేస్తోంది. ఈ క్రమంలో రేణూ దేశాయ్ ఓ పోస్ట్ చేసింది. మనమంతా ఈ ఏడాదిలో కరోనా రాదని అనుకున్నాం.. 2021లో కరోనా అంతమైందని అనుకున్నాం.. మళ్లీ ఎప్పటిలానే సాధారణ జీవితాన్ని గడుపుతామని అనుకున్నాం. కానీ అది అక్కడితో ఆగడం లేదు. దయచేసి మాస్కులు ధరించండి.. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించండి.

అవసరమైతే తప్పా బయటకు రాకండి.. భౌతిక దూరాన్ని పాటించండి. నేను అయితే సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉంటున్నాను. ఏప్రిల్ 19న ఒకే ఒక్క షూటింగ్ ఉంది. అది కూడా అతి తక్కువ మంది సభ్యులతోనే. ఆ తరువాత నేను కనీసం ఓ నెల పాటు క్వారంటైన్లోనే ఉండబోతోన్నాను. మీ అందరూ కూడా సురక్షితంగా జాగ్రత్తగా ఉండండంటూ రేణూ దేశాయ్ సలహా ఇచ్చింది.


Click it and Unblock the Notifications











