Don't Miss!
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- News దేశ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు పవన్ కళ్యాణ్
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
‘రిపబ్లిక్’ మూవీపై రేవంత్ రెడ్డి రివ్యూ: సినిమా చూసిన తర్వాత ఎమ్మెల్యే సీతక్క రియాక్షన్ ఇలా!
మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో పలువురు అద్భుతమైన టాలెంట్తో స్టార్లుగా ఎదిగిపోయారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఒకడు. బ్యాగ్రౌండ్తో సినిమాల్లోకి ప్రవేశించినా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ.. చాలా తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. అయితే, మధ్యలో పరాజయాల పరంపరతో తెగ ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'చిత్రలహరి'తో హిట్ ట్రాక్ ఎక్కాడు సాయి తేజ్. అప్పటి నుంచి వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాడు.
అరాచకమైన డ్రెస్తో రెచ్చిపోయిన దిశా పటానీ: వామ్మో అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా!
హిట్లు మీద హిట్లు కొడుతూ పుల్ జోష్లో ఉన్న సాయి ధరమ్ తేజ్.. విభిన్నమైన సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు దేవ కట్టాతో 'రిపబ్లిక్' అనే సినిమాను చేశాడు. పూర్తి స్థాయి రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి ధరమ్ తేజ్ ఆస్పత్రిలో చికిత్సను తీసుకుంటున్నా.. చిత్ర యూనిట్ ఈ మూవీని విడుదల చేసింది. ఇక, దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీకి అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ సొంతం అయింది. ఫలితంగా మూవీ యూనిట్ యమ సంతోషంగా ఉంది.
భారీ అంచనాలు నెలకొన్న కారణంగా సాయి ధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' మూవీకి దాదాపు అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 13.60 కోట్లు మేర వ్యాపారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేశారు. చాలా చోట్ల విడుదలవడంతో పాటు టాక్ కూడా బాగుండడంతో ఈ మూవీకి కలెక్షన్లు భారీగానే వచ్చాయి. మొదటి రోజు దాదాపు మూడు కోట్ల రూపాయల వరకూ వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు కూడా కోటిన్నర వరకూ రాబట్టింది. మూడో రోజు కూడా భారీగానే కలెక్షన్లను వసూలు చేసింది. దీంతో మొత్తంగా మూడు రోజుల్లో దాదాపు నాలుగు కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది.
షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు
సందేశాత్మకంగా తెరకెక్కిన 'రిపబ్లిక్' మూవీకి మెగా అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు సైతం జేజేలు పలుకుతున్నారు. అలాగే, చాలా మంది సెలెబ్రిటీలు సైతం ఈ చిత్రంపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఏఎంబీ థియేటర్లో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ములుగు సీతక్క 'రిపబ్లిక్' మూవీని వీక్షించారు. అనంతరం వీళ్లిద్దరూ చిత్ర యూనిట్ను అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. అదే సమయంలో ఈ చిత్రం ఎంతో మంచి సబ్జెక్టుతో తెరకెక్కిందని, ముఖ్యంగా దీన్ని యువత చూడాలని ఆకాంక్షించారు.
క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన 'రిపబ్లిక్' మూవీలో సాయి ధరమ్ తేజ్ ఐఏఎస్ ఆఫీసర్గా నటించాడు. ప్రభుత్వంపై పోరాట చేసే పాత్రలో అతడు అద్భుతంగా కనిపించాడు. ఇక, ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రను చేశారు. అలాగే, ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. దీనికి మణి శర్శ సంగీతం అందించాడు.