Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రధాని నరేంద్ర మోదీని హిట్లర్తో పోల్చిన ఆర్జీవీ
వివాదాస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం క్రియేట్ చేస్తూనే ఉంటాడు. తాజాగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. తన ట్వీట్లో ప్రధాన మంత్రిని జర్మన్ నియంత హిట్లర్తో పోల్చడం గమనార్హం.
హిట్లర్ ఒక చిన్నారి చెవులు పట్టుకుని ఉన్న ఫోటోను పోలిన నరేంద్రమోదీ పిక్ పిక్ వర్మ షేర్ చేశారు. 'సేమ్ టు సేమ్' అంటూ కామెంట్ పెట్టారు. వర్మ చేసిన ఈ పోస్టులో నెటిజన్లు చాలా అర్థాలు తీస్తున్నారు. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది.
అయితే వర్మ పోస్ట్ చేసిన పిక్ రియల్ కాదని... ఫోటోషాప్ చేసిన పిక్ అంటూ కొందరు కామెంట్స్ పోస్ట్ చేశారు. వర్మకు బయోపిక్స్ తీసీ తీసీ రియల్ ఫోటోలకు, ఫేస్ ఫోటోలకు తేడా తెలియకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Same to same pic.twitter.com/ZFdqBq4pED
— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2019
తన మరో ట్వీట్లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ గురించి ప్రస్తావించారు రామ్ గోపాల్ వర్మ. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని అనకాపల్లిలో బలవంతంగా అడ్డుకున్నారంటూ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఒక న్యూస్ పేపర్ కటింగ్ ఈ సందర్భంగా షేర్ చేశారు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాకేష్ రెడ్డి నిర్మాతగా రూపొందిన ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేయగా.... ఎన్నికల కోడ్ అమలులో ఉందనే కారణంతో ఈసీ ఈ చిత్రాన్ని ఆపివేసిన సంగతి తెలిసిందే.