Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
KRKR షాకింగ్ అప్డేట్: రాంగోపాల్ వర్మ వాళ్లను కూడా టార్గెట్ చేశాడట..
రాంగోపాల్ వర్మ.. భారతదేశంలోనే పేరొందిన డైరెక్టర్లలో ఒకరు. తన క్రియేటివిటీతో సరికొత్త ప్రయోగాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మంచి మంచి సినిమాలు అందిస్తూ బడా డైరెక్టర్గా ఎదిగాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ నుంచి వెళ్లి బాలీవుడ్, హాలీవుడ్లోనూ సత్తా చాటాడు. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలు రూపొందించిన వర్మ.. ఇప్పుడు మాత్రం వివాదాస్పద అంశాలను టచ్ చేస్తున్నాడు. ఈ కారణంగా సంచలన దర్శకుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయాడు. ఆర్జీవీ మరోసారి వివాదాస్పద అంశాన్నే ఎంచుకున్నాడు. దీంతో ఈ సినిమా కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
వివాదాస్పదం కాదంటూనే
రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఆంధ్రప్రదేశ్లోని రెండు కులాలను ప్రధానాంశంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు. దీనిని ప్రారంభించిన సమయంలో వివాదాస్పదం కాకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తానని వర్మ చెప్పాడు. అయినప్పటికీ ఈ సినిమా వివాదాస్పదం అవుతూనే ఉంది.
విడుదలకు బ్రేక్ పడింది
‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'కు సంబంధించిన అప్డేట్స్ ఇస్తుండడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో దాదాపుగా అర్థం అయిపోయింది. దీంతో దీని విడుదలను ఆపాలని కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. గురువారం దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సినిమాను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆదేశించింది.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో సంచలనం
రాంగోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. ముఖ్యంగా ఆయన కొద్ది రోజుల క్రితం తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఎంతటి వివాదానికి కారణం అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఓ పార్టీకి వ్యతిరేకంగా ఉందన్న ఆరోపణలతో కొందరు కోర్టు వరకు వెళ్లారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో సినిమా విడుదల ఆలస్యం అయింది. కేవలం తెలంగాణలో మాత్రమే ఈ సినిమా విడుదలైంది.
ఇప్పుడు కూడా వాళ్లే టార్గెట్
వర్మ తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలోనూ ఓ పార్టీకి చెందిన నేతలనే టార్గెట్ చేశాడని ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చే విధంగా వర్మ విడుదల చేసిన అన్ని వీడియోల్లో ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా సీన్లు కనిపించాయి. అప్పటి నుంచి ఈ సినిమా మొత్తం వాళ్లకు వ్యతిరేకంగా తీసిందేనని అంతా అనుకుంటున్నారు.
వైసీపీ వాళ్లనూ వదల్లేదు
ఇక, ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. రాంగోపాల్ తీసిన ఈ సినిమాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా వదల్లేదనేదే ఆ వార్త సారాంశం. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కూడా కొన్ని సీన్లు పెట్టాడని అంటున్నారు. అయితే, అవి రాష్ట్ర బాగు కోసమే అన్నట్లు చూపించాడట వర్మ.