Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పోలీసులు, గ్యాంగ్స్టర్స్లో లెస్పియన్స్.. కొట్టుకొని చచ్చారు.. వర్మ డేంజరస్గా సరికొత్త వివాదం
దర్శకుడు రాంగోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండటమనే విషయంపై ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎంచుకొనే కథలు, తీసే సినిమాలు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండటమే అందుకు కారణమనేది అందరికి తెలిసిందే. ఇప్పటికే ఆయన తీసిన రెండు చిత్రాలు కోర్టుల్లో ఉండగా, మరో వివాదాస్పద చిత్రానికి శ్రీకారం చుట్టారు. తాజాగా వర్మ రిలీజ్ చేసిన డేంజరస్ సినిమా ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ చిత్ర కథ గురించి వర్మ చెప్పిన ఆసక్తికరమైన అంశాలు ఏమిటంటే..
అమృత జీవితంపై మూవీ
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమృత, ప్రణయ్ల ప్రేమ గాథ, పరువు హత్య నేపథ్యంగా రూపొందించిన చిత్ర రిలీజ్పై కోర్టు ఆదేశాలు ఉన్నాయి. బాధితురాలు అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా అడ్డుకొన్నారు. దాంతో ఈ చిత్ర రిలీజ్ వాయిదా పడింది.
దిశ ఎన్కౌంటర్పై వివాదం
ఇక దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ రేప్, ఎన్కౌంటర్ ఆధారంగా దిశ చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేయగా మంచి స్పందన కనిపించింది. తన కూతురు జీవిత కథపై సినిమాను రూపొందించడంపై దిశ తండ్రి కోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా రిలీజ్పై, చిత్రాన్ని రూపొందించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
తొలి లెస్పిబియన్ సినిమా అంటూ
దిశ, అమృత చిత్రాల పరిస్థితి ఇలా ఉండగానే, రాంగోపాల్ వర్మ స్వజాతి సంపర్కంపై తొలి లెస్పియన్ సినిమా అంటూ డేంజరస్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను ఇటీవల రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సినిమా పోస్టర్లు ఇప్పుడు నెటిజన్లు, సినిమా ప్రేక్షకుల మధ్య చర్చనీయాంశమయ్యాయి.
Recommended Video
పోలీసులు, గ్యాంగస్టర్స్
`బ్యూటీపుల్' హీరోయిన్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్' బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రల్లో డేంజరస్ అనే మూవీని తెరకెక్కించారు. రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కొన్ని పోస్టర్స్ను విడుదల చేశారు. ఇండియాలోనే తొలి లెస్బియన్ క్రైమ్, యాక్షన్ ఫిల్మ్., ఈ లెస్బియన్స్ ఎఫైర్ చాలా మందిని చంపేసింది. వారిలో పోలీసులు, గ్యాంగ్స్టర్స్ కూడా ఉన్నారు అని పోస్టర్పై వర్మ తెలిపారు.