Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
RRR మరో రికార్డు.. ఆ విషయంలో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సినిమా!
ప్రపంచ ప్రఖ్యాత 'బాహుబలి' దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, ఈరోజు టి-సిరీస్ ఒక అద్భుతమైన ప్రకటన చేసింది. ఎవరూ ఊహించని విధంగా టి-సిరీస్ ఆర్ఆర్ఆర్ అభిమానులకు ప్రత్యేక బహుమతి ఇచ్చింది. భారతదేశ ప్రజలే కాకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు సైతం ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ అతిపెద్ద యాక్షన్ డ్రామా చిత్రం 'ఆర్ఆర్ఆర్' యొక్క సంగీత హక్కులు పొందడం తమకు సంతోషంగా ఉందని టీ సిరీస్ సంస్థ వెల్లడించింది.
అంటే, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ యొక్క సంగీతానికి సంబంధించిన అన్ని హక్కులు టి-సిరీస్ అందుకున్నట్టయింది. అయితే ఈ విషయంలో కూడా ఆర్ఆర్ఆర్ రికార్డు కొట్టినట్టు అయింది. ఎలా అంటే గతంలో చివరిగా యష్ యొక్క కెజిఎఫ్ 2 ఆడియో హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. కన్నడ సూపర్ స్టార్ యష్ చిత్రం కె జి ఎఫ్ చాప్టర్ 2 యొక్క ఆడియో హక్కులు లహిరి మ్యూజిక్ మరియు టి-సిరీస్ లకు భారీ మొత్తానికి అమ్మినట్లు గతంలో ఈ సినిమా నిర్మాతలు వెల్లడించారు.
ఈ సినిమా ఆడియో హక్కులు మేకర్స్ 7.2 కోట్ల రూపాయలకు అమ్మారు. ఇది భారీ మొత్తం. అప్పటికి ఈ సినిమా సౌత్ మొత్తం మీద టాప్ లో ఉండేది. కానీ ఈరోజు ఆర్ఆర్ఆర్ దెబ్బకి ఆ సినిమాను దాటేసింది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాని కూడా కేజీఎఫ్ ను కొనుకున్న రెండు సంస్థలు సంయుక్తంగా కొనుక్కున్నాయి.అది కూడా ఏకంగా 25 కోట్ల రూపాయలకి అని తెలుస్తోంది. ఇక స్వాతంత్రం కోసం పోరాటం చేసి వీర మరణం పొందిన తెలుగు వాళ్ళు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రల ఆధారంగా రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, హీరోయిన్లుగా నటిస్తున్నారు.