Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
RRR మరో రికార్డు.. ఆ విషయంలో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సినిమా!
ప్రపంచ ప్రఖ్యాత 'బాహుబలి' దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, ఈరోజు టి-సిరీస్ ఒక అద్భుతమైన ప్రకటన చేసింది. ఎవరూ ఊహించని విధంగా టి-సిరీస్ ఆర్ఆర్ఆర్ అభిమానులకు ప్రత్యేక బహుమతి ఇచ్చింది. భారతదేశ ప్రజలే కాకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు సైతం ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ అతిపెద్ద యాక్షన్ డ్రామా చిత్రం 'ఆర్ఆర్ఆర్' యొక్క సంగీత హక్కులు పొందడం తమకు సంతోషంగా ఉందని టీ సిరీస్ సంస్థ వెల్లడించింది.
అంటే, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ యొక్క సంగీతానికి సంబంధించిన అన్ని హక్కులు టి-సిరీస్ అందుకున్నట్టయింది. అయితే ఈ విషయంలో కూడా ఆర్ఆర్ఆర్ రికార్డు కొట్టినట్టు అయింది. ఎలా అంటే గతంలో చివరిగా యష్ యొక్క కెజిఎఫ్ 2 ఆడియో హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. కన్నడ సూపర్ స్టార్ యష్ చిత్రం కె జి ఎఫ్ చాప్టర్ 2 యొక్క ఆడియో హక్కులు లహిరి మ్యూజిక్ మరియు టి-సిరీస్ లకు భారీ మొత్తానికి అమ్మినట్లు గతంలో ఈ సినిమా నిర్మాతలు వెల్లడించారు.
ఈ సినిమా ఆడియో హక్కులు మేకర్స్ 7.2 కోట్ల రూపాయలకు అమ్మారు. ఇది భారీ మొత్తం. అప్పటికి ఈ సినిమా సౌత్ మొత్తం మీద టాప్ లో ఉండేది. కానీ ఈరోజు ఆర్ఆర్ఆర్ దెబ్బకి ఆ సినిమాను దాటేసింది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాని కూడా కేజీఎఫ్ ను కొనుకున్న రెండు సంస్థలు సంయుక్తంగా కొనుక్కున్నాయి.అది కూడా ఏకంగా 25 కోట్ల రూపాయలకి అని తెలుస్తోంది. ఇక స్వాతంత్రం కోసం పోరాటం చేసి వీర మరణం పొందిన తెలుగు వాళ్ళు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రల ఆధారంగా రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, హీరోయిన్లుగా నటిస్తున్నారు.