Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
మహేశ్ బాబు కొత్త సినిమా నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్: తెర వెనుక అంత జరుగుతుందా!
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు. కెరీర్ ఆరంభం నుంచీ కమర్షియల్ చిత్రాల్లోనే కాకుండా ప్రయోగాలు కూడా చేస్తున్నాడు. ఇలా హిట్లు ప్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఒకటి పట్టాలపై ఉండగానే మరొకటి అన్నట్లు ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటున్నాడు.
Bigg Boss: షొలో అర్ధరాత్రి వాళ్లిద్దరి రొమాన్స్.. పెదాలను తాకుతూ కొంటెగా.. అక్కడ కూడా కిస్ చేయమంటూ!
ప్రస్తుతం మహేశ్ బాబు.. వంద కోట్ల దర్శకుడిగా పేరొందిన పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకూ దాదాపు అరవై శాతం పూర్తైంది. ఇక, దీని తర్వాత మహేశ్ బాబు నటించబోయే సినిమాపై చాలా కాలం పాటు చర్చలు జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ బడా డైరెక్టర్లలో ఒకడైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించాడు.
మహేశ్ బాబు 'అతడు', 'ఖలేజా' వంటి చిత్రాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో జత కట్టాడు. ఎన్నో అంచనాలతో రాబోతున్న ఈ సినిమాను ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. మహేశ్తో చేసే ఈ మూవీ కోసం త్రివిక్రమ్ ఇప్పటికే ఫుల్ స్క్రిప్టును రెడీ చేసేశాడట. అంతేకాదు, దీనికి డైలాగ్ వెర్షన్ను కూడా కంప్లీట్ చేసేశాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అలాగే, థమన్ కూడా ఈ చిత్రం కోసం అప్పుడే మూడు నాలుగు పాటలను రెడీ చేసి పెట్టాడని అంటున్నారు. మొత్తం ప్రీ ప్రొడక్షన్తో పాటు మరిన్ని పనులు కంప్లీట్ అయ్యాయని కూడా తెలిసింది.
Samantha Naga Chaitanya Divorce: పెళ్లికి ముందే చెప్పిన వేణు స్వామి.. సమంతకు ఆ సమస్య అంటూ!
మహేశ్ బాబు అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ సర్ప్రైజింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్పుడే సెట్ వర్క్ కూడా మొదలు పెట్టేశాడట. ఇందుకోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో రూ. 5 కోట్ల ఖర్చుతో భారీ సెట్ను నిర్మిస్తున్నారట. దీన్ని ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. ఇక, ఈ సినిమాను నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. అప్పటి వరకూ మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' షూట్ను పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.
భారీ బడ్జెట్తో రాబోతున్న ఈ మూవీలో మహేశ్ బాబు రా ఏజెంట్గా కనిపిస్తాడని అంటున్నారు. అలాగే, అతడి లుక్ కూడా సరికొత్తగా ఉండబోతుందట. ఇందులో సూపర్ స్టార్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు 'పార్థు', 'అతడే పార్థు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. దీనికి ఎడిటర్గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్గా ఏఎస్ ప్రకాశ్, కెమెరామెన్గా మథి, మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్ థమన్ చేస్తున్నాడు.