Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ కొత్త మూవీ పట్టాలెక్కుతోంది!
'ఆర్ ఎక్స్ 100 ' ఫేమ్ కార్తికేయ... చేసింది ఒకే సినిమా అయినా ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులపై అంతలా ఇంపాక్ట్ చూపింది. ఈ సినిమా తర్వాత కార్తికేయకు వరుస అవకాశాలు వచ్చాయి. కార్తికేయ హీరోగా జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం జనవరి 17 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రం గురించి కార్తికేయ మాట్లాడుతూ... ఆర్ ఎక్స్ 100 తర్వాత చాలా కథలు విన్నాను, వాటిలో అర్జున్ జంధ్యాల చెప్పిన కథ బాగా నచ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించడంతో ఓకే చెప్పాను. ఈ నెల 17 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. లొకోషన్లోకి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ... నేను బోయపాటి శ్రీనుగారి దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశాను. ఆయన నాకు గురువు మాత్రమే కాదు, సోదర సమానులు. కార్తికేయ కథకు ఓకే చెప్పడం వల్లనే సినిమా పట్టాలెక్కింది. ఫ్యాషన్ ఉన్న నిర్మాతలు దొరికారు. ఒంగోలు కీలక సన్నివేశాలతో సినిమా మొదలు పెడుతున్నామని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ... జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఒంగోలు ఏరియాలో తొలి షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటల చిత్రీకరణ జరుగుతుంది. త్వరలో హీరోయిన్తో పాటు ఇతర వివరాలు ప్రకటిస్తామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్య భరద్వాజ్, కెమరా: 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ రామ్, ఆర్ట్ డైరెక్టర్ : జీయమ్ శేఖర్.