కబడ్డీలోకి అడుగుపెట్టబోతున్న రాజమౌళి తనయుడు!
దర్శక ధీరుడు రాజమౌళి సినిమా తెరకెక్కుతుందంటే ఆయన కుటుంబ సభ్యులు మొత్తం అందులో భాగస్వామ్యులు అవుతారు. రాజమౌళి తనయుడు కార్తికేయ ఇప్పటికే బాహుబలి, బాహుబలి 2చిత్రాలలో కీలక పాత్ర వహించాడు. రాజమౌళి త్వరలో తెరకెక్కించబోయే ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ చిత్రంలో కూడా కార్తికేయ కీలకమైన భాద్యతలు నిర్వహించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా కార్తికేయ నెమ్మదిగా వ్యాపారంలోకి కూడా అడుగుపెడుతున్నారు. తాజగా జరుగుతున్న ప్రచారం ప్రకారం కార్తికేయ కబడ్డీలో పెట్టుబడి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఓ కబడ్డీ జట్టుని కార్తికేయ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 14 నుంచి తెలంగాణ ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం కాబోతోంది. ఈ కబడ్డీ పోటీల్లో కార్తికేయ నల్గొండ ఈగల్స్ టీం తరుపున పెట్టుబడి పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











