Don't Miss!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- News బీజేపీకి అనపర్తి సీటు కేటాయింపు వెనుక వైసీపీ..!?
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
రామ్ చరణ్ - శంకర్ మూవీ నుంచి కీలక ప్రకటన: అతడికే జై కొట్టిన స్టార్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో ఫుల్ జోష్లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రుధిరం రణం)లో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటిస్తున్నాడు. ఇది షూటింగ్ పూర్తి కాకముందే దిగ్గజ దర్శకుడు శంకర్తో సినిమాను ప్రకటించాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. అదే సమయంలో నటీనటులతో పాటు టెక్నీషియన్ల ఎంపిక ప్రక్రియను కూడా సదరు దర్శకుడు జరుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ భారీ చిత్రం నుంచి వేచి చూస్తున్న అదిరిపోయే అప్డేట్ ఒకటి వచ్చేసింది.
రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా ఎవరు చేస్తారన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే ఏఆర్ రెహమాన్, అనిరుథ్ సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఈ మూవీ కోసం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్లో 'మ్యూజిక్ సెన్సేషన్ థమన్ మా సినిమాలో భాగం అయ్యాడు. అతడితో పాటు 135 మంది టెక్నీషియన్లు చేసిన రీ రికార్డింగ్కు శంకర్, రామ్ చరణ్ ఆశ్చర్యపోయారు' అని కొన్ని ఫొటోలను షేర్ చేసింది చిత్ర యూనిట్.
భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని 'ఒకే ఒక్కడు' స్టైల్లో చిత్రీకరించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తున్నాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ రూపొందనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో రాబోతున్న ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.