Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘సాహో’ అసలు బడ్జెట్ ఎంతో వెల్లడించిన ప్రభాస్
బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత వస్తున్న సినిమా కాడంతో ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'సాహో'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగిన విధంగానే 'సాహో' చిత్రాన్ని క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా నిర్మించారు.
సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇండియాలోనే అతిపెద్ద బడ్జెట్ చిత్రాల్లో ఒకటి. తొలుత ఈ చిత్రం బడ్జెట్ రూ. 250 కోట్లుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 300 కోట్ల వరకు ఖర్చు చేశారంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఓ బాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'సాహో' బడ్జెట్ ఎంతో తెలిపారు యంగ్ రెబల్ స్టార్.
'సాహో' చిత్రానికి భారీ బడ్జెట్ ఖర్చు చేశాం. టోటల్ రూ. 350 కోట్లు ఖర్చయింది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్లడంతో అంత భారీ మొత్తం ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇండియాలోని టాప్ టెక్నీషియన్లతో పాటు హాలీవుడ్, చైనా నుంచి ఎక్స్పర్ట్స్ పని చేసినట్లు ప్రభాస్ తెలిపారు.
ఆగస్టు 30న హిందీతో తెలుగు, తమిళం, మలయాళంలో విడుదల చేస్తున్నారు. 'సాహో' డిస్ట్రిబ్యూటర్ అనిల్ తదాని ట్రైలర్ లాంచ్ ఈవెంటులో మాట్లాడుతూ ఈచిత్రాన్ని దేశ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. 'కేవలం నార్త్ ఇండియాలోనే 4500 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం. సౌతిండియా కూడా భారీగా రిలీజ్ అవుతుంది' అన్నారు.
సాహో మూవీ కోసం చాలా మంది బాలీవుడ్ స్టార్స్ను ఎంపిక చేశారు. హీరోయిన్ శ్రద్ధా కపూర్తో పాటు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అన్ని భాషల నుంచి నటీనులను ఎంపిక చేశారు.