Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
సాహోకి ఎదురుదెబ్బ.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మళ్ళీ!
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఎదురుచూపులకు తెరపడింది. ప్రభాస్ సాహో ఎప్పుడెప్పుడు వస్తుందా? అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చుసిన ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టారు. ఈ రోజే (ఆగస్టు 30) సాహో సినిమా భారీ రేంజ్లో రిలీజ్ అయింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ కళకళలాడుతున్నాయి. ఇంతలో సాహోకి ఊహించని ఎదురుదెబ్బ తగిలిందనే వార్త ప్రభాస్ అభిమానులతో సహా సినీ లోకాన్ని కలవరపెడుతోంది. ఇంతకీ ఏం జరిగింది? వివరాల్లోకి పోతే..
Read in English:Saaho Twitter Review: Here's What Fans Feel About The Prabhas Starrer
భారీ మూవీకి భారీ రెస్పాన్స్
ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా సాహో తెరకెక్కింది. దాదాపు 350 కోట్లు కేటాయించి హై రేంజ్లో ఈ సినిమా చిత్రీకరించారు. చిత్రంలో నటించిన నటీనటులందరికీ భారీ పారితోషికం ఇచ్చారు. ఈ మేరకు విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. నేడు ఓ రేంజ్ అంచనాల నడుమ విడుదలైన సాహో అదే రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
ప్రభాస్ యాక్షన్.. సుజీత్ స్క్రీన్ ప్లే
తెలుగుతో సహా మలయాళ, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కావడంతో దేశవ్యాప్తంగా సాహోపై అంచనాలు నెలకొన్నాయి. దీంతో భారీ రేంజ్ లో ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ సాహోలో ప్రభాస్ యాక్షన్, సుజీత్ స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందని అంటున్నారు. తెలుగోడు గర్వించదగిన సినిమా సాహో అని కితాబిస్తున్నారు.
ఇంతలోనే ఎదురుదెబ్బ.. ఊహించని షాక్
ఈ రోజే (ఆగస్టు 30) విడుదలైన సాహో కొన్ని గంటల్లోనే ఊహించని ఎదురుదెబ్బ తాకిందని తెలుస్తోంది. ఈ భారీ చిత్రంపై పైరసీ దారుల కన్ను పడిందని తెలిసింది. మొదటి షోతో చిత్రాన్ని పైరసీగా మార్చేసి సాహో యూనిట్కి ఊహించని షాకిచ్చారని వార్తలు వస్తున్నాయి. సినిమాను అప్పుడే ఆన్లైన్ లో పెట్టేశారని సమాచారం.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మళ్ళీ
పైరసీ భూతం విషయంలో అటు ప్రభుత్వం, ఇటు సినీ పరిశ్రమ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. అయినా కూడా మళ్ళీ మళ్ళీ ఈ పైరసీ భూతం వెంటాడుతూనే ఉంది. సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమాను కూడా వదలక పోవడంతో సినీ లోకం తీవ్ర నిరాశ చెందుతోంది. పైరసీని అరికట్టి సినిమాలను ప్రోత్సహించాలని వాళ్ళు కోరుతున్నారు.
సాహో మూవీ
యూవీ క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కింది 'సాహో' సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు.