Kushi: విజయ్, సమంత ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. ఇది జీర్ణించుకోవడం కష్టమే
'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్గా ఎదిగిపోయాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకట్టుకున్న అతడు.. ఆ తర్వాత ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుని ఫాలోయింగ్తో పాటు మార్కెట్ను పెంచుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ కుర్రాడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. అయితే, కొంత కాలంగా విజయ్ వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవల 'లైగర్' అనే చిత్రంతో వచ్చాడు. కానీ, ఇది కూడా డిజాస్టర్ అయింది.
విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ ప్రస్తుతం 'ఖుషి' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తైంది. ఇందులో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. అదే సమయంలో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. దీంతో చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది.

ఇదిలా ఉండగా.. ప్యూర్ లవ్ స్టోరీతో రాబోతున్న 'ఖుషి' మూవీ నుంచి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ మూవీ విషాదాంతంగా ముగుస్తుందట. అంటే.. విజయ్ దేవరకొండ, సమంత పాత్రలు రెండూ సినిమాలో చనిపోతాయట. అయితే, దీన్ని చివర్లో చూపించి సినిమాపై బ్యాడ్ ఇంప్రెషన్ రాకుండా ఉండాలన్న కారణంతో టైటిల్ కార్డ్ పడిన వెంటనే చూపిస్తారని తెలిసింది. అంటే.. అసలు వీళ్లు ఎందుకు చనిపోయారు అనేది ఫ్లాష్బ్యాక్ స్టోరీతో చూపించబోతున్నాడట దర్శకుడు. ఇప్పుడీ న్యూస్ అటు విజయ్, ఇటు సమంత అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోంది.
'ఖుషి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











