Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
సుకుమార్ బ్యానర్లో సాయి ధరమ్ తేజ్.. కొత్త సినిమాను ప్రారంభించిన సుప్రీమ్ హీరో
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. రేపు (డిసెంబర్ 25) కొత్త సినిమా విడుదల కాబోతోంది. సోలో బ్రతుకే సో బెటర్ అంటూ తన అదృష్టాన్ని, సినీ భవిష్యత్తును, థియేటర్ల ఆదరణను పరీక్షించుకోబోతోన్నాడు. పాండమిక్ సమయంలో ఇలా థియేటర్లోకి వస్తోన్న మొదటి చిత్రంగా సోలో బ్రతుకే సో బెటర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక వైపు టాలీవుడ్ అంతా కూడా సోలో బ్రతుకే సో బెటర్ను ప్రమోట్ చేసే పనిలో పడింది.
హీరోలందరూ సాయి ధరమ్ తేజ్ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. మళ్లీ థియేటర్లలో పండుగ వాతావరణాన్ని చూడాలంటూ హీరోలందరూ కోరుకుంటున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ ఇలా ఇతర హీరోలందరూ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను భుజాన మోశారు. ఇదిలా ఉండగా సాయి ధరమ్ తేజ్ తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను మొదలెట్టేసి లాంఛనంగా సినిమాను ప్రారంభించేశాడు.
సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ బ్యానర్లో సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తానికి ఈ మూవీకి సంబంధించిన ఓ కాన్సెప్ట్ పోస్టర్ను ఆ మధ్య రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. జాతకలు, మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ మూవీకి సుకుమార్ కథనాన్ని అందించనున్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.