అమెరికా పయనమైన మెగా మేనల్లుడు.. ఇక ప్రతీ రోజు పండగే!
సాయి ధరమ్ తేజ్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్పై తెరకెక్కుతోంది 'ప్రతీ రోజు పండుగే' మూవీ. మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. బన్నీవాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ బాణీలు కడుతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉండగానే సాయి ధరమ్ తేజ్ మామ మెగాస్టార్ చిరంజీవి కూడా పరిశీలించి ఓకే చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న 'ప్రతీ రోజు పండుగే' సినిమా యూనిట్ ఇక అమెరికా బయల్దేరనుంది. అక్కడి అందమైన లొకేషన్స్లో చిత్రంలోని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. తాతామనవళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కుటుంబ బంధాలు, విలువలు, భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిధరమ్కు తాతగా సత్యరాజ్ నటిస్తున్నారు.

ఇన్ని రోజులు పల్లె వాతావరణం ప్రతిబింబించేలా పలు సెట్స్ వేసి షూటింగ్ వేసిన చిత్రయూనిట్.. ఇక అమెరికా అందాలను కెమెరాలో బంధించడానికి రెడీ అయింది. ఈ రోజు (మంగళవారం) సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ లుక్ కొత్తగా ఉంటుందని, మారుతి తరహా ఎంటర్టైన్మెంట్ రెండింతలు ఎక్కువగా ఈ చిత్రంలో ఉంటుందని అంటున్నారు యూనిట్ సభ్యులు. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











