Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అక్కడెక్కడో జరిగితే బాధపడ్డాం.. కానీ మనం చేస్తున్నదేంటి? మెగా మేనల్లుడి రియాక్షన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అతిపెద్ద అటవీ ప్రాంతమైన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు సినీ ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దీంతో ఇది కాస్త రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
తప్పు చేసి క్షమాపణ చెప్పిన అనసూయ.. నా ఉద్దేశం అర్థం చేసుకోండి అంటూ ట్వీట్
యురేనియం తవ్వకాలపై అభ్యంతరం తెలుపుతూ ఇప్పటికే విజయ్ దేవరకొండ, అనసూయ లాంటి సినీ తారలు స్పందించగా, తాజాగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇదే విషయంపై ట్వీట్ పెట్టారు. ''ఎక్కడో ఉన్న అమెజాన్ అడవులు కాలిపోతుంటే మనం బాధపడ్డాం. కానీ మనం చేస్తున్నదేంటి? రండి.. మన ప్రకృతిని కాపాడుకుందాం. సేవ్ నల్లమల'' అని సాయిధరమ్ తేజ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Ekkado unna #Amazon gurunchi badha padamu,manam em chesthunam mari... let’s preserve our nature #SaveNallamala 🙏🏼 pic.twitter.com/DSLBMSouwv
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 13, 2019
ఇక సాయిధరమ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజూ పండుగే' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ జోడీగా రాశీఖన్నా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్పై ఈ సినిమాను బన్నీవాస్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.