Don't Miss!
- Sports ముంబయి ఇండియన్స్కు కొత్త బౌలర్ వచ్చాడు
- Automobiles కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- News బీఆర్ఎస్ అస్తిత్వంపై బలంగా కొడుతున్న తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి!!
- Finance IT News: CEO మైండ్ బ్లాంక్ చేసిన IT ఉద్యోగి.. నెట్టింట పోస్ట్ వైరల్.. ఆ ఒక్క మాటతో..
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ప్రభుత్వం ఎలా ఉందో తెలియదు: ఆకట్టుకుంటోన్న సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ లుక్
వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న తరుణంలో 'చిత్రలహరి' అనే మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఇక, దాని తర్వాత మారుతి తెరకెక్కించిన 'ప్రతి రోజూ పండగే'తో కెరీర్లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత అంటే లాక్డౌన్ అనంతరం వచ్చిన 'సోలో బ్రతుకే సో బెటర్'తో మరో సూపర్ హిట్ను అందుకుని విజయాల హ్యాట్రిక్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుస సక్సెస్లతో దూసుకుపోతోన్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం 'రిపబ్లిక్' అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది.
సాయి ధరమ్ తేజ్.. ప్రస్థానం ఫేం దేవకట్టా దర్శకత్వంలో చేస్తున్న చిత్రమే 'రిపబ్లిక్'. కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభం అయింది. ఈ దర్శకుడి సినిమాలు అంటేనే వైవిధ్యంగా సాగుతుంటాయి. వీటిలో ఎక్కువగా రాజకీయ కోణాలు కనిపిస్తుంటాయి. ఇక, ఈ చిత్రం కూడా పొలిటికల్ బ్యాగ్డ్రాప్తోనే రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో సాయి ధరమ్ తేజ్ లుక్తో పాటు ఓ మెసేజ్ను కూడా ఉంచారు.
మినీ స్కర్ట్లో రకుల్ ప్రీత్ అందాల ఆరబోత.. కొంచెం నాటీ.. మరికొంచెం ఘాటుగా
'డెబ్బై నాలుగేళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బ్రతుకుతున్నాం. కానీ, మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు' అంటూ సినిమా కాన్సెప్టును చెప్పకనే చెప్పింది 'రిపబ్లిక్' మూవీ యూనిట్. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కొల్లేరు సరస్సు సమస్యలపై ఈ మూవీ రూపొందుతోందని అంటున్నారు. ఇది జూన్ 4న విడుదల కానుంది.