Don't Miss!
- Finance IPO News: ఒక్క నిమిషంలో డబ్బును డబుల్ చేసిన ఐపీవో.. తొలిరోజే లాభాల తుఫాను..
- Sports PSL Final: ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి విజయం Video
- Automobiles కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- News తల పట్టుకున్న మాజీ ప్రధాని, మోదీ మాట వింటారా ?, ఫ్యామిలీ సమస్యలతో ఆ సీటు గోవిందా ?
- Technology ఆకట్టుకొనే డిజైన్, AI ట్రిపుల్ కెమెరా, 6.7 డిస్ప్లేతో మోటోరోలా స్మార్ట్ఫోన్.. విడుదల, సేల్ వివరాలు..!!
- Lifestyle ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ప్రభుత్వం ఎలా ఉందో తెలియదు: ఆకట్టుకుంటోన్న సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ లుక్
వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న తరుణంలో 'చిత్రలహరి' అనే మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఇక, దాని తర్వాత మారుతి తెరకెక్కించిన 'ప్రతి రోజూ పండగే'తో కెరీర్లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత అంటే లాక్డౌన్ అనంతరం వచ్చిన 'సోలో బ్రతుకే సో బెటర్'తో మరో సూపర్ హిట్ను అందుకుని విజయాల హ్యాట్రిక్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుస సక్సెస్లతో దూసుకుపోతోన్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం 'రిపబ్లిక్' అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది.
సాయి ధరమ్ తేజ్.. ప్రస్థానం ఫేం దేవకట్టా దర్శకత్వంలో చేస్తున్న చిత్రమే 'రిపబ్లిక్'. కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభం అయింది. ఈ దర్శకుడి సినిమాలు అంటేనే వైవిధ్యంగా సాగుతుంటాయి. వీటిలో ఎక్కువగా రాజకీయ కోణాలు కనిపిస్తుంటాయి. ఇక, ఈ చిత్రం కూడా పొలిటికల్ బ్యాగ్డ్రాప్తోనే రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో సాయి ధరమ్ తేజ్ లుక్తో పాటు ఓ మెసేజ్ను కూడా ఉంచారు.
మినీ స్కర్ట్లో రకుల్ ప్రీత్ అందాల ఆరబోత.. కొంచెం నాటీ.. మరికొంచెం ఘాటుగా
'డెబ్బై నాలుగేళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బ్రతుకుతున్నాం. కానీ, మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు' అంటూ సినిమా కాన్సెప్టును చెప్పకనే చెప్పింది 'రిపబ్లిక్' మూవీ యూనిట్. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కొల్లేరు సరస్సు సమస్యలపై ఈ మూవీ రూపొందుతోందని అంటున్నారు. ఇది జూన్ 4న విడుదల కానుంది.