Don't Miss!
- Sports PBKS vs MI: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్లో ఓడాం: సామ్ కరణ్
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘రిపబ్లిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్: స్పెషల్ డేను లాక్ చేసుకోబోతున్న సాయి ధరమ్ తేజ్
కొంత కాలంగా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఈ ఉత్సాహంతోనే మరిన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు 'రిపబ్లిక్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. అయితే, మధ్యలో అనుకోని అవాంతరాలు రావడంతో చిత్రీకరణ ఆలస్యం అయింది. అయినప్పటికీ ఇప్పటికే టాకీ పార్టును దాదాపుగా పూర్తి చేసేశారు. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి అదిరిపోయే న్యూస్ లీకైంది.
విలక్షణ చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు దేవ కట్టా. అతడి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రమే 'రిపబ్లిక్'. పొలిటికల్ బ్యాగ్డ్రాప్తో రాబోతున్న ఈ సినిమాను జూన్ 4న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్యం కాలేదు. దీంతో దీన్ని ఓటీటీలో నేరుగా రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపించింది. కానీ, అది కూడా అవాస్తవమే అని తేలింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. 'రిపబ్లిక్' మూవీని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటనను అతి త్వరలోనే వెల్లడించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
శృతి మించిన టాలీవుడ్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్: ఎద అందాలు చూపిస్తూ రచ్చ.. ప్యాంటును కూడా తీసేసి మరీ!
కొల్లేరు సరస్సు సమస్యల నేపథ్యంలో రూపొందిన 'రిపబ్లిక్' మూవీలో సాయి ధరమ్ తేజ్ ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన ఉద్యోగాన్ని వదిలేసి హీరో ప్రజల కోసం పోరాటం చేయడం అనే కాస్సెప్టుతో ఇది రూపొందిందట. ఇక, ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రను చేస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.