Don't Miss!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మెగా అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటాం: సాయిధరమ్ తేజ్
మెగా అభిమానులకు పండుగ రోజు అంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ ఏడాది ఆయన బర్త్ డేని ఎంతో స్పెషల్గా నిర్వహిస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మెగా ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 22న ఆయన 64వ పుట్టిన రోజు సందర్బంగా భారీ వేడుక ప్లాన్ చేశారు. ఈ వేడుక హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగింది. అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ ఫంక్షన్కు ప్రత్యేక అతిథులు విచ్చేసి సందడి చేశారు.
ఈ వేడుకలో భాగంగా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి మొమెంటో అందచేసిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ముందుగా మెగా అభిమానులను పలకరిస్తూ ఎలా ఉన్నారని అడిగారు. మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ''హ్యాపీ బర్త్ డే పెద్ద మావయ్య. మీరింకా ఎన్నో సినిమాలు చేస్తూ మమ్మల్ని అలరిస్తూ ఉండాలి. ఆంజనేయ స్వామి మీకు ఆ స్ట్రెంగ్త్ ఇవ్వాలని కోరుకుంకుంటున్నా. ప్రతీ సంవత్సరం ఆగస్టు 22ను ఓ పండగలా చేసుకునే మెగా అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. నేను 15 ఏళ్లుగా చూస్తున్నా.. ప్రతీ ఏడాది ఇలాగే ఒక పండగ జరుగుతూనే ఉంది. అది మీ వల్లే సాధ్యమైంది. థాంక్ యూ సో మచ్. మెగా అభిమానులకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. మీ ఆశీస్సులు మాపై ఉన్నందుకు థాంక్యూ'' అన్నారు.
ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి మెగా అభిమానులు తరలి రావడం విశేషం. శిల్పకళా వేదిక ప్రాంగణమంతా మెగా అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఈ పుట్టినరోజు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్స్ అందరూ పాల్గొని అభిమానులకు కనువిందు చేశారు. ఇక ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కావడం మరో విశేషం. త్వరలో చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సారి పుట్టినరోజు వేడుక మరింత స్పెషల్ అయింది.