Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మరోసారి సోలోగా రాబోతున్న సాయి ధరమ్ తేజ్.. రిపబ్లిక్ రిలీజ్ డేట్ ఫిక్స్
కరోనా కష్టకాలంలో అసలు సినిమాలు విడుదలవ్వడమే అనుమానం అనుకున్న తరుణంలో.. లాక్ డౌన్ తరువాత సినిమాలు రిలీజ్ అవ్వడం బాక్సాఫీస్ హిట్ అవ్వడం అన్ని చాలా స్పీడ్ గా జరిగిపోయాయి. ఒక విధంగా ఇండస్ట్రీకి మంచి బూస్ట్ వచ్చిందనే చెప్పాలి. ముందుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకు సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవలేదనిపించే విధంగా కలెక్షన్స్ ను అందుకుంది.
మిగతా హీరోలు కూడా చేతిలో ఉన్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ క్రమంలో మెగా హీరో సాయి మరింత స్పీడ్ పెంచాడు. ఈ ఏడాదిలో ఎలాగైనా రెండేసి సినిమాలను విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు. దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సోషల్ డ్రామాలో నటిస్తున్న సాయి ఆ సినిమాను జూన్ 4న రిలీజ్ చేయాలని ఫిక్స్ ఆయాడు.
అందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతనికైతే జూన్ లో ఏ సినిమా విడుదల తేది కూడా ఫిక్స్ కాలేదు. కానీ సాయి ధరమ్ తేజ్ సోలోగా రావడానికి రెడీ అయ్యాడు. ఇక సుకుమార్ ప్రొడక్షన్ లో ఆయాన శిష్యుడు కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తున్న మరో మూవీని కూడా ఈ ఏడాది చివరలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కుదిరితే డిసెంబర్ 24న ఆ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుందట. సాయి గత రెండు సినిమాలు కూడా డిసెంబర్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి.