Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరోసారి సోలోగా రాబోతున్న సాయి ధరమ్ తేజ్.. రిపబ్లిక్ రిలీజ్ డేట్ ఫిక్స్
కరోనా కష్టకాలంలో అసలు సినిమాలు విడుదలవ్వడమే అనుమానం అనుకున్న తరుణంలో.. లాక్ డౌన్ తరువాత సినిమాలు రిలీజ్ అవ్వడం బాక్సాఫీస్ హిట్ అవ్వడం అన్ని చాలా స్పీడ్ గా జరిగిపోయాయి. ఒక విధంగా ఇండస్ట్రీకి మంచి బూస్ట్ వచ్చిందనే చెప్పాలి. ముందుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకు సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవలేదనిపించే విధంగా కలెక్షన్స్ ను అందుకుంది.
మిగతా హీరోలు కూడా చేతిలో ఉన్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ క్రమంలో మెగా హీరో సాయి మరింత స్పీడ్ పెంచాడు. ఈ ఏడాదిలో ఎలాగైనా రెండేసి సినిమాలను విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు. దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సోషల్ డ్రామాలో నటిస్తున్న సాయి ఆ సినిమాను జూన్ 4న రిలీజ్ చేయాలని ఫిక్స్ ఆయాడు.
అందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతనికైతే జూన్ లో ఏ సినిమా విడుదల తేది కూడా ఫిక్స్ కాలేదు. కానీ సాయి ధరమ్ తేజ్ సోలోగా రావడానికి రెడీ అయ్యాడు. ఇక సుకుమార్ ప్రొడక్షన్ లో ఆయాన శిష్యుడు కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తున్న మరో మూవీని కూడా ఈ ఏడాది చివరలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కుదిరితే డిసెంబర్ 24న ఆ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుందట. సాయి గత రెండు సినిమాలు కూడా డిసెంబర్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి.