Don't Miss!
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- News నీ భార్యతో ఎంజాయ్ చెయ్యాలని ఉంది, ఫ్రెండ్స్ పార్టీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి భర్తకు ఆఫర్ !
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
- Sports IPL 2024: మాటిస్తున్నా..జరిగేది అదే- గంభీర్
- Technology Samsung నుంచి గెలాక్సీ అల్ట్రా డేస్ సేల్! ఆఫర్ల వివరాలు
- Automobiles Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
సాయి ధరమ్ తేజ్ నుంచి అదిరిపోయే అప్డేట్: ముహూర్తం వెల్లడించిన ‘రిపబ్లిక్’ యూనిట్
'చిత్రలహరి' అనే సినిమా నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. రెండేళ్ల క్రితం మారుతి తెరకెక్కించిన 'ప్రతి రోజూ పండగే'తో కెరీర్లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అతడు.. లాక్డౌన్ తర్వాత వచ్చిన 'సోలో బ్రతుకే సో బెటర్'తో మరో సూపర్ హిట్ను అందుకుని హ్యాట్రిక్ కొట్టేశాడు. ఈ జోష్లో ఉన్న మెగా హీరో.. ఆ వెంటనే 'రిపబ్లిక్' అనే మరో సినిమాను సైతం పట్టాలెక్కించేశాడు. దీని ద్వారా సాయి ధరమ్ తేజ్ తొలిసారి పొలిటికల్ బ్యాగ్డ్రాప్తో సినిమా చేస్తున్నాడు. ఇక, ఈ మూవీ టీజర్ గురించి చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది.
విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు దేవ కట్టా. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్తో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న చిత్రమే 'రిపబ్లిక్'. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. అందులో 'డెబ్బై నాలుగేళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బ్రతుకుతున్నాం. కానీ, మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు' అంటూ ఓ డైలాగును ఉంచి సినిమా కాన్సెప్టును చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 5న ఈ సినిమా టీజర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
రాజకీయ నేపథ్యంతో రాబోతున్న 'రిపబ్లిక్' మూవీని భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కొల్లేరు సరస్సు సమస్యలపై ఈ మూవీ రూపొందుతోందని అంటున్నారు. ఇది జూన్ 4న విడుదల కానుంది.