Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
భేష్ సాయిమాధవ్ బుర్రా.. 300 మంది రంగస్థల కళాకారులకు చేయూత
పేద, ధనికులనే తేడా లేకుండా అన్నివర్గాలపై కరోనావైరస్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ప్రదర్శన ఇస్తే గానీ పూట గడవని కళాకారులు పరిస్థితి గురించి ఇక చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎంతో మంది కళాకారులు సరైన అవకాశాలు, ఆదరణ లేక పేదరికంలో మగ్గుతున్నారు. అలాంటి వారిని కరోనా లాక్డౌన్ ఆర్థికంగా మరింత కుంగదీస్తున్నది.
ఈ క్రమంలో కళాకారులు జీవితం, వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిన రంగస్థల నటుడు, దర్శకుడు, సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ రంగస్థల నటులకు అండగా నిలిచారు. సమాజంపై తన వంతు బాధ్యతగా పేద కళాకారులకు నిత్యావసర వస్తువులను అందించారు. తన సొంత పట్టణం తెనాలిలో 300లకుపైగా రంగస్థల కుటుంబాలను ఆదుకొన్నారు. తన కళావేదిక కళల కాణాచి అనే సంస్థ ద్వారా సుమారు రూ.3 లక్షల రూపాయల విలువైన సరుకులను కళాకారులకు అందించారు.
జీవితంలో తాను ఎదగడానికి కారణమైన రంగస్థలాన్ని, ఆ కళాకారులను ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గుర్తుంచుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తోటి కళాకారులను ఆదుకోవడంపై సాయిమాధవ్ బుర్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా పేద కళాకారులు ఆర్థిక పరిస్థితులను, వారి జీవన విధానాన్ని అడిగి తెలుసుకొన్నారు. సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ వారితో తన అనుభవాలను, గతంలో నాటక రంగంలో కొనసాగినప్పటి అనుభూతులను ఈ సందర్భంగా పంచుకొన్నారు.