Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సాయి పల్లవి ఫ్యాన్స్కు షాక్.. లవ్ స్టోరి మూవీ రిలీజ్ వాయిదా
ప్రమాదకరమైన కరోనావైరస్ దెబ్బకు టాలీవుడ్ విలవిలలాడే పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పటికే ఆచార్య సినిమా రిలీజ్ వాయిదా పడినట్టు వార్తలు వస్తుండగా తాజాగా మరో సినిమా ఆ జాబితాలో చేరింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి, నాగచైతన్య నటించిన లవ్ స్టోరి చిత్రాన్ని వాస్తవంగా ఏప్రిల్ 16వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు. గత రెండు వారాలుగా కరోనావైరస్ వ్యాప్తి ఊహించని విధంగా మారిపోవడంతో టాలీవుడ్ పరిశ్రమ ఆందోళనకు గురి అవుతున్నది. ఇప్పటికే నివేదా థామస్, అంజలి, అల్లు అరవింద్ లాంటి సినీ ప్రముఖులకు పాజిటివ్ రావడంతో అందరిలోనూ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తమైంది.
ఇలాంటి పరిస్థితుల్లో లవ్ స్టోరి సినిమా విడుదలను వాయిదా వేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయం తీసుకొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతం కెపాసిటీని తెలుగు రాష్ట్రాల్లో విధించే అవకాశం ఉండటంతో సినిమాను కొద్ది నెలలు వాయిదా వేయాలని నిర్మాతలు పుష్కర్ రామ్మోహన్ రావు, నారాయణదాస్ నారంగ్ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది.
దీంతో సాయిపల్లవి, అక్కినేని అభిమానులు షాక్ గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాలోని సారంగ ధరియా, ఇతర పాటలు ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేశాయి. ఈ క్రమంలో ఈ సినిమాను ఎప్పుడెప్పుడూ చూడాలనే కుతూహలంతో ఉన్న అభిమానులకు షాక్ తగిలే అవకాశం ఉంది.