Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
HIT హిందీ రీమేక్ మొదలు.. రాజ్కుమార్ రావ్తో శైలేష్ కొలను పిక్ వైరల్
మన తెలుగు కథలు వరుసబెట్టి బాలీవుడ్కు వెళ్తోన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి, జెర్సీ, హిట్ వంటి సినిమా కథలన్నీ కూడా బాలీవుడ్కు పయనమయ్యాయి. ఇందులో అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్గా రీమేక్ అవ్వడం అందరికీ తెలిసిందే. కబీర్ సింగ్ బాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దాదాపు మూడు వందల కోట్లు కొల్లగొట్టడంతో మన తెలుగు కథలకు గిరాకీ పెరిగింది. ఈక్రమంలోనే మరి కొన్ని కథలు అక్కడికి వెళ్లాయి.
జెర్సీ సినిమా కూడా హిందీలో రీమేక్ అయింది. షాహిద్ కపూర్ హీరోగా హిందీలో జెర్సీ షూటింగ్ కూడా పూర్తయింది. ఇక చిన్న సినిమాగా విడుదలైన HIT మూవీ తెలుగులో భారీ హిట్ అయింది. విశ్వక్సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. అందుకే ఈ మూవీని బాలీవుడ్లో రాజ్ కుమార్ రావును హీరోగా పెట్టి శైలేష్ కొలను డైరెక్ట్ చేసేందుకు సిద్దమయ్యాడు.
లాక్డౌన్ సమయంలో శైలేష్ కొలను హిట్ సినిమా రీమేక్ గురించి అధికారికంగా ప్రకటించాడు. తాజాగా రాజ్ కుమర్ రావును శైలేష్ కొలను కలిశాడు. ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ శైలేష్ కొలను ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతోందని తెలిపాడు. మొత్తానికి ఒక్క సినిమాతోనే బాలీవుడ్ ఆఫర్ను చేజెక్కించుకున్నాడు. ఇక ఈ మూవీ తరువాత హిట్ సీక్వెల్ను తెలుగులో తెరకెక్కించే అవకాశం ఉంది.