Don't Miss!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
‘మేజర్’ కోసం సల్మాన్ ఖాన్.. టీజర్ అప్డేట్పై అడివి శేష్
ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవిత చరిత్ర ఆధారంగా అడివి శేష్ మేజర్ మూవీని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మేజర్ అంటూ ఇప్పటికే వదిలిన వీడియోలు, టీజర్, పోస్టర్లు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. అయితే తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గత నెలలోనే విడుదల కావాల్సిన టీజర్ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు టీజర్కు సంబంధించి అదిరిపోయే ప్రకటన చేశారు.
మేజర్ టీజర్ మార్చి 28న రిలీజ్ కావాల్సింది కానీ మేజర్ మూవీ డైరెక్టర్ ఫ్యామిలీలో విషాదం నెలకొనడం, కరోనా కేసులు కూడా పెరగుతూ ఉండటంతో మేజర్ టీజర్ను వాయిదా వేస్తున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ టీజర్కు సంబంధించిన అతి పెద్ద ప్రకటనను చేశారు. టీజర్ను మూడు భాషల్లో ఒకే సారి విడుదల చేయనుండగా.. ముగ్గురు సూపర్ స్టార్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు.
రేపు సాయంత్రం మేజర్ టీజర్ను హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో మహేష్ బాబు, మళయాలంలో పృథ్వీరాజ్ విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు వదిలిన అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏప్రిల్ 12న సాయత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు మేజర్ టీజర్ రాబోతోంది. ఈ మధ్యే మేజర్ సినిమాలో హీరోయిన్ల పరిచయ పోస్టర్లను విడుదల చేయగా అవి బాగానే వైరల్ అయ్యాయి. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ జూలై 2న రాబోతోంది.