Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
‘మేజర్’ కోసం సల్మాన్ ఖాన్.. టీజర్ అప్డేట్పై అడివి శేష్
ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవిత చరిత్ర ఆధారంగా అడివి శేష్ మేజర్ మూవీని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మేజర్ అంటూ ఇప్పటికే వదిలిన వీడియోలు, టీజర్, పోస్టర్లు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. అయితే తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గత నెలలోనే విడుదల కావాల్సిన టీజర్ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు టీజర్కు సంబంధించి అదిరిపోయే ప్రకటన చేశారు.
మేజర్ టీజర్ మార్చి 28న రిలీజ్ కావాల్సింది కానీ మేజర్ మూవీ డైరెక్టర్ ఫ్యామిలీలో విషాదం నెలకొనడం, కరోనా కేసులు కూడా పెరగుతూ ఉండటంతో మేజర్ టీజర్ను వాయిదా వేస్తున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ టీజర్కు సంబంధించిన అతి పెద్ద ప్రకటనను చేశారు. టీజర్ను మూడు భాషల్లో ఒకే సారి విడుదల చేయనుండగా.. ముగ్గురు సూపర్ స్టార్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు.
రేపు సాయంత్రం మేజర్ టీజర్ను హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో మహేష్ బాబు, మళయాలంలో పృథ్వీరాజ్ విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు వదిలిన అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏప్రిల్ 12న సాయత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు మేజర్ టీజర్ రాబోతోంది. ఈ మధ్యే మేజర్ సినిమాలో హీరోయిన్ల పరిచయ పోస్టర్లను విడుదల చేయగా అవి బాగానే వైరల్ అయ్యాయి. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ జూలై 2న రాబోతోంది.