Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఐదు గెటప్స్తో సల్మాన్.. భారత్ మోషన్ పోస్టర్ వైరల్
Recommended Video
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం భారత్ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ కేక పెట్టిస్తున్నది. ఈ చిత్రంలో సల్మాన్ పోషించిన వివిధ రకాల గెటప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. రంజాన్ పండుగకు ఈ చిత్రం రిలీజ్ కానున్నది. 1964 నుంచి ప్రారంభమై.. 2010 వరకు సాగే కథలో రకరకాల షేడ్స్లో సల్మాన్ కనిపించే అన్ని పాత్రలను గత కొద్దిరోజులుగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే
ఐదు రకాల గెటప్స్తో
1964లో సర్కస్లో స్టంట్ మాస్టర్గా, 1970లో మైనింగ్లో పనిచేసే కూలీగా, 1985లో నేవీలో పనిచేసే ఆఫీసర్గా, 1990లో వయసు మీద పడిన వ్యక్తిగా వివిధ గెటప్స్లో సల్మాన్ ఖాన్ కనిపిస్తారు. వీటికి సంబంధించిన మోషన్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి.
సల్మాన్ సరసన కత్రినా కైఫ్
భారత్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ నటిస్తున్నది. ఈ సినిమాలో లక్కీగా సల్మాన్తో కలిసి నటించే అవకాశం దక్కింది. ప్రియాంక చోప్రా ఈ సినిమాను వదిలేయడంతో ఆ అవకాశం కత్రినాకు దక్కిన సంగతి తెలిసిందే. 2017 తర్వాత టైగర్ జిందా హై సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి నటించారు.
సల్మాన్ ఖాన్ నిర్మాతగా
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారత్ చిత్రానికి సల్మాన్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి, భూషణ్ కుమార్ నిర్మాతలు. ఈ చిత్రంలో టబు, జాక్రీ ష్రాఫ్, దిశా పటానీ, సునీల్ గ్రోవర్, సొనాలి కులకర్ణి, నోరా ఫతేహీ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.
జూన్ 5న విడుదల
దక్షిణ కొరియాలో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్న ఆడ్ టు మై ఫాదర్ చిత్రానికి రీమేక్ భారత్. ఈ చిత్రానికి విశాల్, శేఖర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జూలియస్ పాకియం, సినిమాటోగ్రఫి జార్జ్ సీ విలియమ్స్, రామేశ్వర్ ఎస్ భగత్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 5వ తేదీన రిలీజ్ కానున్నది.