సల్మాన్ను నటుడిగా నిలబెట్టిన సినిమాకు సీక్వెల్.. 16 ఏళ్ల క్రితం నాటి మూవీకి..
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ను నటుడిగా నిలబెట్టిన చిత్రం తేరే నామ్. 16 ఏళ్ల క్రితం రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. సరికొత్త గెటప్, హెయిర్ స్లయిల్తో నవ యువకుడిగా సల్మాన్ కనిపించిన యూత్ను ఆకర్షించాడు. సల్మాన్ ఖాన్కు జంటగా భూమిక చావ్లా నటించిన సినిమాకు సతీష్ కౌశిక్ దర్శకుడు. ఆ అలాంటి మూవీ సల్మాన్ ఫ్యాన్స్కు కొత్త అనుభూతిని నింపిన తేరేనామ్ సినిమాకు సీక్వెల్ సిద్దమవుతున్నది.
తేరే నామ్ సినిమా కథకు సంబంధం లేకుండా సీక్వెల్గా రూపొందనున్నట్టు బాలీవుడ్ పత్రిక వెల్లడించింది. సీక్వెల్కు సరికొత్త కథను సిద్ధం చేశాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్ట్రిప్టు పూర్తయింది. ఉత్తరాదికి చెందిన ఓ గ్యాంగ్స్టర్ చుట్టూ కథ తిరుగుతుంది అని కథనంలో పేర్కొన్నది.

తేరే నామ్ 2 సినిమా సీక్వెల్పై బాలీవుడ్ పత్రికల్లో వస్తున్న కథనాలపై దర్శకుడు సతీష్ కౌశిక్ స్పందించాడు. సీక్వెల్ను రూపొందిస్తున్న విషయం నిజమే. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నాం. త్వరలో అధికారికంగా అన్ని విషయాలు వెల్లడిస్తాం అని కౌశిక్ తెలిపారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన భారత్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దంబంగ్ 3, సంజయ్ లీలా భన్సాలీ రూపొందించే ఇన్షా అల్లా సినిమాలు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











