Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సమంతకు అరుదైన చర్మ సమస్య.. మేనేజర్ క్లారిటీ ఏమిటంటే?
దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు అరోగ్యంపై మరోసారి రూమర్లు భగ్గుమన్నాయి. ఆమె అరుదైన చర్మ సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్య నుంచి బయట పడటానికి ఎవరి తెలియకుండా విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకొంటున్నారు. తాను ఎక్కడికి వెళ్లారనే విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారనే వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్త కంట్రోల్ తప్పుతుండటంతో సమంత మేనేజర్ మహేంద్ర స్పందించారు.
సమంత అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నారనే వార్తను మేనేజర్ మహేంద్ర ఖండించారు. ఆ వార్తలో వాస్తవం లేదు. అది ఒక గాసిప్ మాత్రమే అని వివరణ ఇచ్చారు. అయితే సమంత ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారని చెప్పారు. అయితే సమంత ఎక్కడికి వెళ్లారనే విషయాన్ని చెప్పడానికి నిరాకరించారు. దాంతో ఈ వార్తపై మరింత అనుమానాలు, మేనేజర్ వివరణపై సందేహాలు వ్యక్తమయ్యాయి.
సాధారణంగా సమంత రుత్ ప్రభు ఎప్పడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అయితే సెప్టెంబర్ 10వ తేదీ తర్వాత ఒక్క పోస్టు కూడా పెట్టకుండా మౌనంగా ఉన్నారు. ఆమె యశోద టీజర్ను చివరిసారిగా షేర్ చేశారు. ఆమె సోషల్ మీడియాలో కనిపించకుండా ఉండటంపై అభిమానుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.