Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సమంత ‘ఓ బేబీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది!
సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఓ బేబీ'. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ 55 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోస్టర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సమంత తన ట్విట్టర్ పేజీ ద్వారా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ... సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను విష్ చేశారు. 55 ఏళ్ల లెజెండరీ జర్నీ... ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
Congratulations to @SureshProdns on completing 55 years of an absolutely legendary journey. I'm very happy to be a part of their next. Here's introducing you all to #Swathi from #OhBaby @nandureddy4u enjoyment maamul ga undadu😝😉@peoplemediafcy | @gurufilms1 pic.twitter.com/rJ6wae3wny
— Samantha Akkineni (@Samanthaprabhu2) May 21, 2019
'ఓ బేబీ' చిత్రంలో స్వాతి అనే పాత్రలో కనిపించబోతున్నట్లు సమంత తెలిపారు. ఈ సినిమాలో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు... ఎంజయ్ చేయడానికి రెడీగా ఉండండి అని సమంత పేర్కొన్నారు. ఈ పోస్టర్కు సినీ అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.
'ఓ బేబీ' చిత్రంలో సమంత డెబ్బై ఏళ్ల ముసలమ్మ పాత్రలో... 20 యువతి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు రాని ఒక విభిన్నమైన కథతో ఈ చిత్రం ఉండబోతోందని టాక్.
కోడలు పిల్లతో ఫుల్ హ్యాపీ... సమంత గురించి నాగ్ క్రేజీ ట్వీట్
ఈ చిత్రంపై సమంత భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ గురించి ఆమె గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. చాలా ప్రత్యేకమైన చిత్రం. నాకెంతో నచ్చిన పాత్రలో నటించాను. డైరెక్టర్ నందినీ రెడ్డి చాలా బాగా హ్యాండిల్ చేశారని తెలిపారు.
'మిస్ గ్రానీ' అనే కొరియన్ మూవీకి రీమేక్గా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేష్ బాబు, సునీత తాటి, టిజి విశ్వప్రసాద్, హ్యూనవూ థామస్ కిమ్ నిర్మాతలు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో ఇంకా నాగ శౌర్య, లక్ష్మీ, రావు రమేష్, ప్రగత ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.