Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
యూ టర్న్ ట్రైలర్: ఈ ఐదు రోజులు జరిగింది నిజామా అబద్దమా ? సమంత జీవించిందిగా!
సమంత కెరీర్ లో ఈ ఏడాదిని గోల్డెన్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. సమంత నటిస్తున్న చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తున్నాయి. రంగస్థలం, అభిమన్యుడు, మహానటి చిత్రాల్లో ఈ ఏడాది సమంత నటించింది. ఆ మూడు చిత్రాలు విజయం సాధించాయి. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యూ టర్న్. థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
కన్నడలో సూపర్ హిట్ అయిన యూ టర్న్ చిత్రానికి రీమేక్ గా వస్తోంది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఉత్కంఠ భరితంగా ఉంది. ఈ ఈయూ రోజులు జరిగింది నిజమా అబద్దమా అంటూ సమంత డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఎదో మర్డర్ కు సంబందించిన దర్యాప్తు చేపట్టే పోలీస్ గా ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. పవన్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
మరొక పాత్రలో రాహుల్ రవీంద్రన్ నటిస్తున్నాడు. భూమికని ట్రైలర్ లో కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే చూపించారు. భూమిక పాత్ర ఏంటనే ఉత్కంఠ పెరిగింది. సమంత విలక్షణ నటనతో మెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా యూ టర్న్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.