సమీరం 31న రిలీజ్.. పెళ్లికు ముందే శారీరకంగా..
యశ్వంత్, అక్రితా ఆచార్య జంటగా అనిత క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై తెరకెక్కిన సినిమా సమీరం. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్ట్ 31న విడుదలకు సిద్దమవుతున్నదని నిర్మాత అనితా దేవేందర్ రెడ్డి తెలిపారు. ఇటీవల కాలంలో వచ్చిన చాలా యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ మాదిరిగానే సమీరం చిత్రం కూడా ఉంటుందని దర్శక నిర్మాతలు ధీమాగా వ్యక్తం చేశారు.
ఇప్పటికే విడుదలైన సమీరం పాటలకు, టీజర్కు మంచి స్పందన వచ్చింది. కొత్త వాళ్లైనా కూడా హీరో, హీరోయిన్ బాగా నటించారని దర్శకుడు రవి గండబోయిన చెప్పారు . అన్ని కార్యక్రమాలు పూర్తిచేసకుని ఆగస్ట్ 31న ఈ చిత్రం విడుదల కానుంది.

థాయ్లాండ్ పర్యటనకు వెళ్లిన ఓ యువతి, యవకుడు ప్రేమలో పడుతారు. పెళ్లికి ముందే వారు శారీరకంగా ఒకటవుతారు. ఆ క్రమంలో వారి ప్రేమలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయనే అంశంతో సమీరం తెరకెక్కింది. ఈ చిత్రంలో అమృత ఆచార్య, దివ్య నందినితోపాటు గెటప్ శ్రీను ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు.

సంగీతం: యాజమాన్య
కెమెరా: మధుసూధన్ కోట,
ఎడిటింగ్: బంతల నాగేశ్వర్ రెడ్డి
పాటలు: రాంబాబు గోశాల
నిర్మాతలు : అనిత దేవందర్ రెడ్డి, సురేష్ కేశవన్, జి. రుక్మిణి
రచన, దర్శకుడు: రవి గండబోయిన.



Click it and Unblock the Notifications











