Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ కోసం స్క్రిప్ట్ రెడీ.. మూవీ పక్కా.. సందీప్ రెడ్డి వంగా
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా అదే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసి సక్సెస్ అయ్యాడు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా రూపొందిన ఈ సినిమా పలు వివాదాల సృష్ఠ్టిస్తూనే బాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. దీంతో సందీప్ రెడ్డి వంగా టాలెంట్ మరోసారి బయటపడింది. దీంతో సందీప్ రెడ్డి చేయబోయే ఇతర ప్రాజెక్టుల విషయంలో చర్చలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్త మహేష్ బాబుతో సందీప్ రెడ్డి వంగా సినిమా. ఈ ఇద్దరి కాంబోలో కొత్త సినిమా రానుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబు తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం కారణంగా సందీప్ రెడ్డి వంగా సినిమా చేయలేక పోయారని, ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదని చెప్పుకొన్నారు. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు సందీప్ రెడ్డి- మహేష్ కాంబోలో సినిమా రావడం పక్కా అని తెలుస్తోంది.
కబీర్ సింగ్ సక్సెస్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి.. తాను ఇటీవల మహేష్కి కథ స్టోరీ లైన్ వినిపించగా సూపర్ స్టార్కి బాగా నచ్చిందని చెప్పాడని, మహేష్ తో సినిమా తప్పకుండా చేస్తానని అన్నాడు సందీప్ రెడ్డి. ఈ మేరకు ఆ కథకు సంబందించిన స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తున్నాని తెలిపిన ఆయన త్వరలోనే ఇతర వివరాలు చెబుతానని పేర్కొన్నాడు. దీన్ని బట్టి మహేష్- సందీప్ సినిమా కన్ఫర్మ్ అని అర్థమవుతోంది.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు తన 26 వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'తో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది.